У нас вы можете посмотреть бесплатно # బీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరేపల్లి మోహన్. గజ్జల కాంతం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
బిఆర్ఎస్ బిజెపిలో విలీనం కాబోతోంది ఇది వాస్తవం కరీంనగర్ మేయరు స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ 1000 కోట్లు తీసుకువచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి బిజెపిలో ఉంటేనే హిందువులు అన్నట్లుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రచారం బిజెపి పుట్టకముందే హిందుత్వం పుట్టింది - *పిసిసి ప్రధాన కార్యదర్శి, గజ్జల కాంతం ఫిబ్రవరి 24, ఆర్ & బి అతిథి గృహం, కరీంనగర్ పీసీసీ ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం గారు నేడు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారితో పాటు పలువురు నేతలతో కలిసి కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథి గృహంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గజ్జల కాంతం గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ బిజెపి బిఆర్ఎస్ పార్టీలకు ప్రజలు 20023లో గుణపాఠం చెప్పినప్పటికీ వారు కనీసం ఎలాంటి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేని స్థితికి దిగజారిపోయింది హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో బిఆర్ఎస్ అభ్యర్థి చిత్తుచిత్తుగా ఓడిపోయారు సర్పంచ్ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు పాతర వేశారు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అడ్రస్ ఎక్కడుందో వారికే తెలియాలి, కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ రాష్ట్రంలో గెలుచుకున్న స్థానాలలో ఇండిపెండెంట్ లు మాత్రమే అధికంగా ఉన్నారు, బిఆర్ఎస్ జాడే లేదు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి సరైన తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజుకు 16 గంటలకు ప్రజల కోసం పనిచేస్తున్నారు సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు బిఆర్ఎస్ బిజెపిలో విలీనం కాబోతోంది ఇది వాస్తవం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో బిఆర్ఎస్ నేతలు చర్చలు తెలిపారు, కెసిఆర్ ను జైలులో వేయకుండా చూడాలని బీజేపీ, బిఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది ఫోన్ టాపింగు ఈ ఫార్ములా రేస్ కేసులలో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి గవర్నర్ ఆమోదం తెలుపకపోవడం పట్ల ఇది స్పష్టమవుతుంది అయినప్పటికీ ప్రతిపక్షాలు నీతిమంతులమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది కెసిఆర్ కేటీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఆదరిస్తారు బిఆర్ఎస్ పార్టీ మరో తెలుగుదేశం పార్టీగా ఈ రాష్ట్రంలో మారబోతుంది టిడిపి లేకుండా చేసిన కేసీఆర్ పార్టీ కూడా బిజెపిలో విలనం కాబోతోంది ఈ దేశానికి స్వతంత్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం నెహ్రూ గారు పది సంవత్సరాలు జైలు జీవితం గడిపినారు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు, కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రం కోసం ఏం చేశారో చెప్పాలి తెలంగాణ ప్రజలు విద్యార్థులు, అమరుల త్యాగాలను చూసి చలించిపోయి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, కెసిఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ దొంగలు తెలంగాణ ఎస్సీ ఎస్ టి బిసి ఓసి మైనారిటీ అనివర్గాల ప్రజల పోరాటాన్ని గుర్తించి తెలంగాణ కచ్చితంగా ఇవ్వవలసి ఉంటుందని గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించింది మేము, నాడు మాజీ ముఖ్యమంత్రి కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ కు అనుకూలంగా లేక ఇప్పించింది మేము