У нас вы можете посмотреть бесплатно శ్రీ సరస్వతి గ్రూప్స్ డైరెక్టర్ ఆవుల శంకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
:- శ్రీ సరస్వతి గ్రూప్స్ డైరెక్టర్ ఆవుల శంకర్ రెడ్డి జన్మదిన వేడుకలు :- పేదలకు ఆర్థిక సాయం- అన్నదానం. :- ఆకలితో ఉన్నవారికి ఆకలి తీరుస్తున్న శివం ఫౌండేషన్. కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు... శ్రీ సరస్వతి గ్రూప్స్ డైరెక్టర్ ఆవుల శంకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు పేదల మధ్య శంకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శివం పౌండేషన్ వ్యవస్థాపకులు గొల్ల పూడి శ్రీహరి ప్రతిరోజు ఆకలితో ఉన్నవారికి ఆకలి తీరుస్తూ ఏ ఆధారం లేని వృద్ధులకు శివం శరణాలయంలో ఆశ్రయం కలిగించి విద్య వైద్యం జీవనోపాధికి నిస్సాయిలైన పేదలకు ఈరోజు ఏడుగురికి 80 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటారు అని తెలిపారు. శివం ఫౌండేషన్ లాంటి సం స్థలకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని, ధనవంతులు దాతృత్వంతో ఆర్థిక సాయం అందించాలని తెలిపారు. ఈరోజు గుంటి ధనలక్ష్మి బీఎస్సీ నర్సింగ్ చదువుకి 20 వేల రూపాయలు. వజ్రాల వెంకటేశ్వరి కి కుట్టుమిషన్. గద్దల సంతో షం కి తోపుడు బండి . దివ్యాంగుడు చప్పిడి దయాసాగర్ కి మూడు చక్రాల ట్రై సైకిల్ .కల్ల గళ్ళ హనుమాయమ్మ. బత్తుల రాజారావు. మచ్చు సుబ్బమ్మ లకు వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు అంద జేయడం అయినది. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ మీ కుటుంబాలలో పుట్టినరోజులు పెళ్లిరోజులు ముఖ్య మైన రోజుల్లో శివం శరణాలయంలో జరుపుకొని శివం ఫౌండేషన్ చేసే సేవలో తమ వంతు సహకారం అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా శివం సంచార వాహనం ద్వారా 300 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ సేవ కార్య క్రమం లో శ్రీ సరస్వతి విద్యాసంస్థల సీఈవో ఎన్ వి సురేష్ బాబు. ఏవో చెరుకూరి రమే ష్ బాబు. ప్రిన్సిపాల్ రావూరి శ్రీనివాసరావు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి. రాజేశ్వరి. కోసూరి శ్రీదేవి . మోటుపల్లి వెంకటేశ్వర్లు ( చౌదరి) తదితరు లు పాల్గొన్నారు.