У нас вы можете посмотреть бесплатно విశ్వకర్మ బ్రాహ్మణుల కులదేవత అయినటువంటి కంచి కామాక్షి చరిత్ర..! | MOHANA RAO ACHARYA | LIVE | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#kanchikamakshiammacharithre #vishwakarma #mohanaraoacharya కంచి కామాక్షి విశ్వబ్రాహ్మణ ల కులదేవత ఏ విధంగా అయింది అనే చరిత్రను తెలియజేసే వీడియో. దీన్ని మీరు అందరికీ షేర్ చేయండి. విశ్వకర్మ బ్రాహ్మణుల కులదేవత కంచిలో కొలువైయున్న ఈ కామాక్షి దేవి. విశ్వకర్మ వంశీకుడైన ఆదిశంకరాచార్యులు ఈ దేవతతో పాచికలాడి అక్కడే ఉన్న శ్రీ యంత్రంలో ఆవాహన చేసి ఉగ్రరూపం నుంచి సౌమ్యరూపానికి రావాలని వరాన్ని పొందినటువంటి దృశ్యం. ఆ దేవత పీఠంపై విశ్వకర్మ వంశ కాశీరాజు ధర్మపాలుడు యొక్క నలుగురు బిడ్డలలో ముగ్గురు అయినా రుద్రసేన ఇంద్రసేన భద్ర సేన వారి యొక్క తలలు ఉండడాన్ని గమనించండి .ఈ కథ ఆధారంగా కామాక్షి దేవి విశ్వకర్మ బ్రాహ్మణులకు కులదేవత అయినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ చరిత్రను రూపుమాపడానికి కోసం అప్పటినుంచి ఇప్పటివరకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఆ కుట్రలో భాగంగా ప్రధాన ఆలయం నుంచి ఈ దేవి విగ్రహాన్ని జీర్ణోదారణ పేరుతో విగ్రహాన్ని పెకిలించి దేవాలయం వెనుక వైపున అనగా పడమర దిక్కులోగల వీధిలో ఒక చిన్న ఆలయంలో ప్రతిష్టాపన చేశారు. అక్కడ ఉండే అర్చకులు ఇప్పటికీ కూడా చరిత్ర కథను మార్చి ప్రజలకు చెబుతున్నారు. వారు కంచి కామాక్షి పీఠంపై ఉన్న విశ్వకర్మ వంశ రాజైనటువంటి కాశీ పుణ్యక్షేత్ర ప్రభువైన ధర్మపాలుడు యొక్క నలుగురు కొడుకులలో ముగ్గురి తలలు ఉన్నవి కదా వారి పేర్లు రుద్రసేన భద్ర సేన ఇంద్రసేన అయినటువంటి వీరిని అక్కడ పనిచేస్తున్న అర్చకులు వేరే పేర్లు పెట్టి రాక్షసులుగా చెబుతున్నారు. గతవారం నేను స్వయంగా ఆలయ సందర్శనానికి వెళ్లిన సమయంలో ఆ తలలను చీరతో కప్పి వేసి ఉన్నారు. నేను ఆ తలలు చూడాలి మాకు చూపించండి అనగా అమ్మవారికి అలంకరించిన చీరను తొలగించి ఆర్చకుడు చూపించాడు చూపిస్తూ నేను అడగకుండానే ఆ తలలు రాక్షసులవి అని చెబుతూ ఏదో ఒక కథ చెప్పబోయాడు. వెంటనే వాడిని మందలించి కోపంగా చూసి అసలైన కథ నేను చెబుతాను వినండి అని ఆ తలలకు సంబంధించిన వృత్తాంతాన్ని గంభీర వదనంతో పూర్తిగా చెప్పాను అది తమిళనాడు అయినా కూడా ఆ ప్రాంతంలో అందరికీ తెలుగు తెలుస్తుంది. ఆ సమయంలో మా కుటుంబంతోపాటు అన్య భక్తులు కూడా చాలా ఆసక్తికరంగా నేను చెప్పిన కథను విని ఇన్నాళ్లు ఈ విషయం ఈ చరిత్ర మాకు తెలియదే అని వాపోయారు. దాంతో ఆ అర్చకుడు సిగ్గుతో తలవంచుకొని ఏమి మాట్లాడలేక నవ్వుతూ ఉండిపోయాడు. ఇటువంటి దురాగతాలను మనము అరికట్టాల్సి ఉంది. కాంచీపురం తమిళనాడులో ఉన్న కామాక్షి ఆలయము విశ్వకర్మ బ్రాహ్మణుల కులదేవత యొక్క ఆలయముగా అందరూ తెలుసుకొని దర్శనం చేసుకుని కుల దేవత యొక్క అనుగ్రహాన్ని పొంది అదృష్టవంతులుగా మారగలరు. ఇట్లు మీ యొక్క ప్రియమైన వేదబ్రహ్మశ్రీ ఆచార్య టి మోహనరావు శర్మ, స్టపతి , వేదాధ్యాయి , శిల్పశాస్త్ర పండితులు , శిల్పశాస్త్ర ఉపన్యాసకులు, జ్యోతిష్య విద్వాన్సులు , నాడీ జ్యోతిష్యులు, సంఖ్యాశాస్త్ర నిపుణులు , వైదిక ఇతిహాస పరిశోధకులు , విశ్వకర్మ బ్రాహ్మణుల సనాతన వైదిక విజ్ఞాన మరియు సంధ్యావందనం శిక్షణా శిబిరముల గురువులు, సకల దేవత దేవాలయాల ప్రతిష్టాపన ఆచార్యులు పురోహిత ఆధ్వర్యులు. బెంగళూరు 9341265719.