У нас вы можете посмотреть бесплатно అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కురుగొండ్ల.... или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#venkatagiri #mla #tdp#telugu #viral అసెంబ్లీలో మాట్లాడుతున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రాపూరు–కలువాయి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేయాలి అసెంబ్లీలో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు విజ్ఞప్తి వెంకటగిరి, ఫిబ్రవరి 19, వెంకటగిరి నియోజకవర్గంలోని వెనుకబడిన రాపూరు, కలువాయి మండలాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదలతో ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతాల్లో టూరిజంను ప్రోత్సహిస్తే యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. రాపూరు మండలంలోని పెంచలకోన నందు ఉన్న పెనుశీల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పవిత్ర క్షేత్రంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే పేరు గాంచిన పుణ్యక్షేత్రమని పేర్కొన్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రకృతి అందాలు, కొండల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం కలిగిన ఈ ప్రాంతాన్ని సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కండలేరు ప్రాజెక్టు ప్రాధాన్యం:- 1983లో అప్పటి ముఖ్యమంత్రివర్యులు పూజ్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాపూరు మండలం నందు కండలేరు జలాశయంను నిర్మించారని ఆయన పేర్కొన్నారు. చెన్నై ప్రజల తాగునీటి అవసరాలతోపాటు నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రాంత రైతులకు సాగునీరు, త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్టు రూపుదిద్దుకుందని చెప్పారు. చెన్నైకు పైపులైన్ల ద్వారా నీరు తరలించే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, స్థానిక రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని కాలువ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. తెలుగుగంగ నీటితో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని గుర్తుచేశారు. గతంలో వర్షాధారంపై ఆదారపడి సజ్జ, రాగి, జొన్న వంటి వెల్ది పంటలు సాగు చేసిన రైతులు నేడు వరి పంటను రెండుకార్లు పండించగలుగుతున్నారంటే అది ఎన్టీఆర్ దూరదృష్టి ఫలితమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కండలేరు డ్యాం మట్టికట్టకు రివెట్మెంట్ నిర్మించకపోతే కోతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కలువాయిలో పర్యాటక అవకాశాలు:- కలువాయి మండలంలోని పెన్నబద్వేలు, పెన్నానది వడ్డున ఉన్న పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కండలేరు డ్యాం, కలువాయి మినీ రిజర్వాయర్ వద్ద బోటింగ్ సదుపాయం, పార్కు ఏర్పాటు చేస్తే పర్యాటక అభివృద్ధికి దోహదపడుతుందని సూచించారు. రాపూరు, కలువాయి మండలాల్లో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదించడంతోపాటు ప్రకృతి సోయగాలను వీక్షించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందు దుర్గేష్ గారు కృషి చేయాలని ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతం పర్యాటక పరంగా అభివృద్ధి చెందితే ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు