 
                                У нас вы можете посмотреть бесплатно Justice For Sugali Preethi || జనసేనకు సిగ్గంటే నిందితులపై ప్రభావం చూపాలి || NEW HOPE FOUNDATION или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
                        Если кнопки скачивания не
                            загрузились
                            НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
                        
                        Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
                        страницы. 
                        Спасибо за использование сервиса ClipSaver.ru
                    
గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగిందో.. విచారణ ఎప్పుడు పూర్తయ్యిందో చర్చిద్దాం రావాలని టీడీపీ,జనసేన సోషల్ మీడియాకు జైభీం రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు,మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ సవాల్ విసిరారు. జాతీయ దళిత,బహుజన మహిళా అధ్యక్షురాలు,న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మంచా నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే అంశంపై ఎంవిపి కాలనీలోని గిరిజన భవన్ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుగాలి ప్రీతి కేసులో తప్పుడు కథనాలు వస్తున్నాయంటూ పలువురు వక్తలు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసులో దర్యాప్తు పూర్తి చేసి నిందితుని శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం జడ శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు లేవని,దోషులను ఎక్కడ పట్టుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యానించడం సరికాదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో చర్చించాలని చెపుతున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని, గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతాడా అని ప్రశ్నించారు.జగన్ హయాంలో సుగాలి ప్రీతి కేసు జరకపోయినా వైసీపీ ప్రభుత్వ హయాంలో భూమి,ఉద్యోగం ఇచ్చారని అన్నారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి గిరిజన మహిళ కాదని ఎన్నికల ముందు రంకెలు వేసినపుడు పవన్ కు తెలీదా అని ప్రశ్నించారు. పార్వతిపై అవాకులు,చెవాకులు పేలుతున్న గాదె వెంకటేశ్వర్ ను జనసేన నుండి సస్పెండ్ చేయాలన్నారు. సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నిస్తే జనసేన కార్యకర్తలు చంపేస్తారా..ఇలాంటి వైఖరితో ఉంటే గిరిజన ప్రాంతాల్లో పవన్ కు ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తామని హెచ్చరించారు. జనసేనకు సిగ్గంటే నిందితులపై ప్రభావం చూపాలని,ఈ కేసులో డీఎన్ఏ మార్చింది టీడీపీ నేతలేనని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న తల్లికి అండగా నిలిచి పోరాడుతామన్నారు. సుగాలి ప్రీతి కేసు 2017లో జరిగిందనే విషయమే చాలామందికి తెలియదని మంచా నాగ మల్లీశ్వరి అన్నారు.ఈ కేసును పవన్ కల్యాణ్ రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కేసు సీబీఐ కిచ్చి కథ ముగిసిందనుకుంటున్నారని అసలు కథ ఇప్పుడే మొదలైందని అన్నారు. డీఎన్ఏ ఎవరికి మ్యాచ్ అవుతుందో తేల్చి నిందితుల్ని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.