У нас вы можете посмотреть бесплатно #jubileehillsbyeelection или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
5.11.2025 .....దశాబ్దాల దళిత వర్గీకరణ కల సీఎం రేవంత్ రెడ్డి సాకారం చేసారు ....దళిత బంధు పేరుతో మూడు లక్షల కోట్లు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఎగనామం పెట్టారు .....రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా రేవంత్ పాలన ....రాష్ట్రంలో సుస్థిర పాలన కోసం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలి ....దళితులు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలి ....జవహర్ నగర్ దళిత ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తుమ్మల ... దశాబ్దాల దళిత వర్గీకరణ కల సాకారం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే నని మంత్రి తుమ్మల కీర్తించారు.బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలో జవహర్ నగర్ లో జరిగిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి దళిత వర్గీకరణ చేశారని, గత ప్రభుత్వం దళిత బంధు పథకం పేరుతో అప్పటి ఉప ఎన్నికలో రాజకీయ స్వార్థంతో దళితులను ఓట్ బ్యాంక్ గా చూశారని, మూడు లక్షల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టారనీ వెల్లడించారు. ....రాష్ట్రంలో సుస్థిర పాలన కోసం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని తుమ్మల కోరారు. గత ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పులు చేసి వేల కోట్లు దోచుకున్నారని అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశారని దుయ్యబట్టారు.ప్రజా ప్రభుత్వంలో సాగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు.జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీనీ గెలిపిస్తే దేశంలో శక్తివంతమైన ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి నిలుస్తారని దళిత సోదరులు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలనీ మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాకిటి శ్రీహరి స్థానిక నేతలు పాల్గొన్నారు.