У нас вы можете посмотреть бесплатно Kotappakonda (కొటప్పకొండ) Sri Trikoteswara Swami Temple & కోటప్పకొండ ప్రభలు.,.,,. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Kotappakonda (కొటప్పకొండ) is a sacred hill and major Hindu pilgrimage site located in Palnadu district, Andhra Pradesh, India. It lies about 62 km from Guntur city and 20 km from Narasaraopet. The hill is renowned for the ancient Sri Trikoteswara Swamy Temple, dedicated to Lord Shiva in the form of Trikoteswara (the Lord of the Three Peaks). The temple and the surrounding hills are an important Shaivite center, attracting lakhs of devotees every year. The annual Maha Shivaratri jatara (fair) at Kotappakonda is one of the largest religious gatherings in Andhra Pradesh. కోటప్ప కొండ శ్రీ త్రికూటేశ్వర స్వామి దేవాలయ ప్రత్యేకత- శివరాత్రి రోజు 100 అడుగుల భారీ ప్రభలు- కోటప్పకొండ ప్రభల రహస్యం ఇదే! కోటప్పకొండ ప్రభల ఉత్సవం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జరిగే అత్యంత ప్రసిద్ధ మహాశివరాత్రి జాతర. పల్నాడు ప్రాంత ప్రజలు త్రికోటేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి, చక్కగా అలంకరించిన భారీ ప్రభలతో ఊరేగింపుగా వచ్చి, కొండపైకి చేరుకోవడం ఈ జాతర ప్రత్యేకత. దేశంలోనే అతి పెద్ద తిరునాళ్లుగా పేరొందిన కోటప్ప కొండ జాతర రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉండి, దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ ఆచారం వెనుక ఆశ్యర్యపరిచే అంశాలు ఎన్నో ఉన్నాయి. దేశంలోనే అతి పెద్ద శివరాత్రి తిరునాళ్లు- ఒక్క ప్రభ కడితే చాలు శివయ్య అనుగ్రహిస్తాడట!- కోటప్పకొండ రహస్యం ఇదే! కనువిందు చేసే ప్రభలు పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖంగా ఉండాలని ప్రతి ఏడాది శివరాత్రికి ఇలా ప్రభలు కట్టుకుని కోటప్ప కొండకు రావడం ఆనవాయితీ! ఒక్కో ప్రభ వెంట ఊరు ఊరంతా తరలి రావడం విశేషం. రాష్ట్రంలో మరెక్కడా కన్పించని విధంగా 80 నుంచి 100 అడుగుల ఎత్తున భారీ విద్యుత్ ప్రభలు శివరాత్రి వేళ ఇక్కడ భక్తులకు కనువిందు చేస్తాయి. కొండ దిగి వచ్చే శివయ్య ఒక్క ప్రభ కడితే చాలు శివయ్య అనుగ్రహిస్తాడనే నమ్మకంతో భక్తులు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రభల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. మహా శివరాత్రి రోజు కోటప్ప కొండ ఆలయం వద్ద ఠీవిగా వరుసలో నిలబడ్డ ప్రభల వైభవం భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. కోటి ఒక్క ప్రభలు సమర్పించడం పూర్తయితే ఆ కోటయ్య కొండ దిగి వచ్చి తమను ఆశీర్వదిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఏళ్ల తరబడి ఈ సంప్రదాయాలు ఇలా కొనసాగుతూ వస్తోంది. ఇలా కోటి ప్రభలు త్వరగా పూర్తయి శివయ్య కొండ దిగి వచ్చే రోజు కోసం ఎదురు చూద్దాం.