У нас вы можете посмотреть бесплатно ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు భారీ ర్యాలీ ! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం కర్నూలు రోడ్డులోని విద్యుత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు జిల్లానలుమూలల నుంచి వచ్చిన విద్యుత్ ఉద్యోగులు,కార్మికులు భారీ ర్యాలి నిర్వహించారు. చర్చి సెంటర్ లో మానవ హారం ఏర్పాటు చేశారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుకు అందించారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ హరికృష్ణ విలేకరులతో మాట్లాడుతూ, తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరించుకోవడమే ఈ ర్యాలీ లక్ష్యమన్నారు. ముఖ్యంగా 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్దతిలో పని చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని,ఉద్యోగులందరికీ వైద్య సౌకర్యరం కల్పించాలని, ఖాళీలను భర్తీ చేయాలన్న ప్రధాన డిమాండ్ల సాధన కోసం విద్యుత్ ఉద్యోగులు పోరుబాట పట్టారన్నారు. అలాగే, ఒకే పనికి ఒకే వేతనం విధానం అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు ఈపీఎఫ్, జీపీఎఫ్ అమలు చేయాలన్నారు. ఏపీసీపీడీసీఎల్ జేఏసీ ఛైర్మన్ ఆర్.సంజీవరావు మాట్లాడుతూ, 20 సంవత్సరాలుగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమబాట పట్టా మన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాల్లోని వారికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాకుండా రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. పవర్ జేఏసీ వైస్ ఛైర్మన్ తేళ్ల అంజయ్య మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో యాజమాన్యం దాటవేత వైఖరి అవలంబిస్తోందన్నారు. తమ పోరాటం ప్రభుత్వానికి, ప్రజలకు వ్యతిరేకం కాదని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమేనన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ కన్వీనర్ బి.సురేష్, ప్రకాశం జిల్లా విద్యుత్ జేఏసీ కన్వీనర్ కె.వి.రవి, ఆనందరావు, తేళ్ల జాన్సన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.