У нас вы можете посмотреть бесплатно అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ లపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
రాజధాని అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) ప్రభుత్వ భవనాల నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. ఐదు టవర్లలో నిర్మించనున్న సచివాలయం, హెచ్డీ భవనాలతోపాటు హైకోర్టు, శాసనసభ కట్టడాలకు సంబంధించి అవసరమైన స్థలాల ధృవీకరణ, ప్రభుత్వ సముదాయానికి మౌలిక సదుపాయాల కల్పన, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్లో అంతర్గత, బాహ్య వసతులపై పరిశీలన జరిపేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రోడ్లు, భవనాలశాఖ మంత్రి మండిపల్లి జనార్థనరెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్లతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటయింది. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్కుమార్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు మంత్రులకు అవసరమైన సహకారం అందించాల్సి ఉంటుంది. సచివాలయం, హెచ్ఎడీ భవనాలలో వసతి కల్పించడానికి ప్రతిపాదిం చిన వివిధ విభాగాల కార్యాలయ స్థల అవసరాలను పరిశీలించడం.. సమీక్షిం చడం.. పరిపాలనా హేతుబద్దీకరణ.. అంతర్నిర్మిత స్థల వినియోగాన్ని నిర్ధారిం చడం, విభాగాల కార్యాలయ స్థల అవసరాలను ధృవీకరించడం, క్రియాత్మక జోనింగ్, సోపానక్రమంలో స్థలాల కేటాయింపును మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించి ప్రభుత్వానికి అవసరమైన సిఫార్సులు చేస్తుంది. ఇప్పటికే గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ మాస్టర్ ప్లాన్లో శాసనసభ, హైకోర్టు (స్థూపం లాంటి పైకప్పుతో), 50 అంతస్తుల సచివాలయ భవనం ఉన్నాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెచ్డి కార్యాలయాలను 32 ఎకరాలలో 5 టవర్లతో కూడిన కొత్త ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ కాంప్లెక్స్నుకూడా ప్లాన్ చేస్తున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) 1,350 నుంచి 1,500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ నున్నారు. మాస్టర్-ప్లాన్డ్ హబ్ కృష్ణా నది ఒడ్డున రూపొందించారు. ఇది శాసన సభ, హైకోర్టు సచివాలయం కోసం ఐకానిక్, శాశ్వత డిజైన్లు రూపొందించారు. గ్రీన్ స్పైన్, 13 అర్బన్ ప్లాజాలు అధునాతన నీటిపారుదల వ్యవస్థలతో కూడిన గ్రిడ్ వ్యవస్థను వినియోగిస్తారు. నాలుగు టవర్లు బీ ప్లస్ జీ ప్లస్ 39 అంతస్తులుగా ఉంటాయి, జీఏడీ టవర్ బీ ప్లస్ జీ ప్లస్ 49 అంతస్తులలో నిర్మిస్తారు. ఈ కాంప్లెక్స్లో దాదాపు 145 విభాగాలకు సంబంధించిన సచివాలయ, విభాగాధి పతుల కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. Amaravati, Government Complexes, Cabinet Sub-Committee, Amaravati development, Andhra Pradesh, governance, infrastructure projects, urban planning, political decisions, government policies, Indian politics, public administration, committee meeting, state government, economic development, Andhra Pradesh news, government buildings, local governance, civic planning