У нас вы можете посмотреть бесплатно విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైయస్సార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స అనూష.. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
చీపురుపల్లి నియోజకవర్గం యాంకర్ వాయిస్ నాగేంద్ర వేగా 9న్యూస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా . మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తనయరాలు, యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష ఆధ్వర్యంలో గురువారం గుర్ల, చీపురుపల్లి మరియు గరివిడి పట్టణాల్లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్,చీపురుపల్లి నియోజకవర్గం పరిశీలకులు పెరడా రమణి కుమారి,రాష్ట్ర మహిళా కార్యదర్శి కొయ్యన శ్రీవాణి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం గరివిడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ అనూష పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఒక చరిత్ర అని అన్నారు పార్టీ కార్యకర్తలు నాయుకులు ఏకమై రావాలని కోరారు వచ్చే ఎన్నికల్లో కష్టపడే బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేసారు డాక్టర్ బొత్స అనూష ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అది కోట్ల మంది పేదల ఆశల రూపం. నాన్నగారు (బొత్స సత్యనారాయణ) ఎప్పుడూ చెప్పే మాట ఒక్కటే.. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. ఈ 16 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, మొక్కవోని ధైర్యంతో నిలబడిన ప్రతి కార్యకర్తకు నా సెల్యూట్. రాజన్న ఆశయాలను, జగనన్న సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత ముందుండాలి. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తాం. మీ అందరికీ తోడుగా, అండగా నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను" అని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిశీలకులు పెరడా రమణి కుమారి మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, డాక్టర్ అనూష వంటి యువ నాయకత్వం రావడం నియోజకవర్గానికి గర్వకారణమని కొనియాడారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి కొయ్యన శ్రీవాణి మాట్లాడుతూ.. సామాన్యుడికి న్యాయం చేసే పార్టీ వైఎస్సార్సీపీ అని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంత్, గరివిడి ఎంపీపీ ప్రతినిధి మీసాల విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీ కొనిసి కృష్ణం నాయుడు, గుర్ల ఎంపీపీ ప్రతినిధి సన్యాసి నాయుడు, జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసరావు, చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలు నాయుడు, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.#vegha9news #telugu #vizainagaram #ap #politicalnews #