У нас вы можете посмотреть бесплатно మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి - GPS జాతీయ అధ్యక్షుడు "వడిత్యా శంకర్ నాయక్" или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
:- ఒంగోలులో గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశం -: :- గిరిజనులకు అన్యాయం చేస్తే సహించం... :- మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి... :- ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేరిస్తే సంకటితంగా ఉద్యమిస్తాం.. :- గిరిజన హక్కులు కాలరాస్తే తిరుగుబాటు చేస్తాం... రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తులు :- గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం కల్పించాలి... జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ :- ఒంగోలు రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన సంఘాల నేతల హెచ్చరిక మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిథ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ అన్నారు. ఒంగోలు గిరిజన భవన్ లో ఆదివారం నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి, గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని గిరిజన భవన్ నందు గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన, జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్ ఆధ్వర్యంలో వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో, మేధావులతో, డాక్టర్లతో, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన నేటికీ రాష్ట్రంలోని లక్షలాదిమంది గిరిజనులకు కనీసం కూడు, గూడు, నీడ లేక పరితపిస్తున్నారని, ఇప్పటికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పలాలకు దూరం అవుతున్నారని చెప్పు కొచ్చారు. అంతేకాకుండా గిరిజన జాతీ అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయలు నిధులను దారి మళ్లించకుండా వినియోగించబడాలంటే చట్టసభలలో గిరిజనుల తరఫున ప్రాతినిత్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు. అందుకొరకై మన హక్కుల సంరక్షణ కొరకై సంకటితంగా మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఉద్యమించాలన్నారు. ఎస్టిలో ప్రధానంగా సుగాలి, చెంచు, ఎరుకల, యానాది, నక్కల ఇలా అనేక జాతులు ఉన్నారన్నారు వీరందరికీ సరైన సమాన ప్రాతినిధ్యం లేదన్నారు. రాష్ట్రంలోని గిరిజనులకు రాజకీయంగా మన్యం ప్రాంతాలకు పరిమితం చేయటం వలన మైదాన ప్రాంత గిరిజనులకు గత 58 సంవత్సరాలుగా జరగవలసిన అన్యాయం భారీగా జరిగిపోయిం దన్నారు. ఇకనైనా మేలుకొని మన హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనను తీసుకోరాటం చాలా బాధాకరంగా ఉందన్నారు. అభివృద్ధికి నోచక ఇప్పటికీ దిక్కులేని స్థితిలో గిరిజన ప్రజానీకం జీవిస్తున్నారనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలోకి చేర్చే అంశాన్ని తీసుకువస్తే గిరిజన జాతి ఏకమై సంకటితంగా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయాల్సి వస్తుందన్నారు. 1962 నుండి 67 వరకు చట్టసభలకు నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాలను ఒక యూనిట్గా తీసుకొని రిజర్వేషన్ అందించడం వలన మైదాన ప్రాంతాల్లో అప్పటి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండేది. మైదాన ప్రాంతాల్లో కదిరి, కావలి, మాచర్ల, జగ్గయ్యపేట నాలుగు అసెంబ్లీ స్థానాలకు రిజర్వేషన్ కల్పించి చట్టసభలో ప్రాతినిథ్యం వహించారు కానీ 1967లో ప్రభుత్వ పాలన విధానాల్లో జరిగిన మార్పుల వలన జిల్లా యూనిట్ తీసుకోకుండా రాష్ట్ర యూనిట్ గా తీసుకోవడం వలన ఏజెన్సీ ప్రాంతాలకి మాత్రమే గిరిజన రిజర్వేషన్ నియోజకవర్గం పరిమితమయ్యాయి. అలా చేయడంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 2026 సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ స్థానాలు 175 నుంచి 225 పెంపునకు కొత్తగా ఏర్పాటు కానున్న ఆ నియోజకవర్గాలలో రాష్ట్ర జనాభాలో సగ భాగంగా ఉన్న మైదాన ప్రాంత గిరిజనులకు సామాజికంగా, ఆర్థిక, రాజకీయ ఉద్యోగ రంగాలలో ప్రాతినిత్యం లభించేలా మనమందరం పోరాడవలసిన సమయం ఆసన్నమైందన్నారు. జాతి భవిష్యత్తు కోసం, అభ్యున్నతి కోసం, జాతీ వెలుగు కోసం, ఉద్యమ బాట మొదలుపెట్టి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రతి గిరిజన ప్రాంతాల్లో చేరేలా పోరాడాలన్నారు. అందుకోసం రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా తిరిగి ఈ చైతన్య యాత్ర పేరుతో ఉద్యమిస్తున్నామన్నారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం, జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్, ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎన్ మోహన్ కుమార్ ధర్మ, జిపిఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ హనుమ నాయక్, జై సంతోష్ నాయక్, ఏ శ్రీను నాయక్, వి రాజు నాయక్, రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు రవీంద్ర నాయక్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్ నాయక్, ఆర్ కృష్ణ నాయక్, ఆర్ దస్రు నాయక్, జె హరి నాయక్, ఆర్ అంజి నాయక్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు దుర్గా నాయక్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు హనుమంతు నాయక్, జి గణేష్ నాయక్, జైచంద్ర నాయక్, పాములేటి, ప్రసాద్, రమణమ్మ, బండి రూతమ్మ, కాకి రమణమ్మ, దేవరకొండ రమణమ్మ, వెంకట లక్ష్మమ్మ, తదితరులు మేధావులు పాల్గొన్నారు.