У нас вы можете посмотреть бесплатно బుగ్గ జాతర| బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఆరుట్ల || или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Some Information about BUGGA RAMALINGESWARASWAMI TEMPLE ARUTLA : ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర ఆలయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఉన్న ఆలయం. నిరంతరం పారే సెలయేటి చెంతన లింగేశ్వరుడు స్వయంభువుగా కొలువైన బుగ్గక్షేత్రంలో శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో పౌర్ణమి నుంచి పదిహేను రోజులు జాతర జరుగుతుంది. దీనిని ఆరుట్ల బుగ్గ జాతర అంటారు. ప్రతియేటా కార్తీక పౌర్ణమి కి ప్రారంభమై అమావాస్య వరకు పదిహేను రోజుల జాతర జరుగుతుంది. లింగ పూజలు, స్నానాలు, వ్రతాలు, వనభోజనాలు, కుటుంబం, బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. పేరు ఎలా వచ్చింది రావణ సంహారం తర్వాత శ్రీ రాముడు లింగ ప్రతిష్టాపనలు చేపట్టి శివుని అనుగ్రహం పొందే క్రమంలో భాగంగా త్రేతాయుగంలో శివలింగాన్ని శ్రీరాముడే స్వయంగా ప్రతిష్టించాడని పూర్వీకుల చెబుతున్నారు. రావణుడు బ్రాహ్మణుడు కావడంతో బ్రాహ్మణహత్య నుంచి విముక్తిని పొందుటకు దేశంలో శివలింగాల ప్రతిష్టాపన చేపట్టాడని, శివలింగాలను ప్రతిష్టించి శివుని అనుగ్రహం పొందాడని, శివుని అనుగ్రహంతో బ్రహ్మహత్యా దోష నివారణను పొందాడని చరిత్ర చెబుతోంది. శ్రీ రాముడు బుగ్గ రామలింగేశ్వర ఆలయం వద్ద స్వయంగా బాణాన్ని భూమిపై సంధించి గంగను పైకి రప్పించి శివలింగానికి ఆ నీటితో అభిషేకం చేసి పూజలు చేశాడని పూర్వీకులు చెబుతున్నారు. అందుకే ఈ పుణ్య తీర్థానికి బుగ్గ రామలింగేశ్వరాలయం అని పేరు వచ్చిందని స్థానికులు తెలిపారు. బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయానికి సమీపంలోని గుట్టపై కబీరుదాసు మందిరం ఉంది. కాశీలో ఉపదేశం పొందిన నర్సింహ బాబా అనే సాధువు 1975లో ఇక్కడ కబీరుదాసు మందిరాన్ని నిర్మించారు. ఆలయానికి వచ్చే భక్తులంతా పక్కనేవున్న కబీరుదాసు మందిరాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆలయంలోనే నాగన్నపుట్ట, శివపార్వతుల సన్నిధి ఉంది. కార్తీకమాసం సందర్భంగా నాగన్నపుట్టకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కార్తీకమాసంలో పుట్టలో నుంచి నాగరాజు బయటికి వచ్చి కనిపిస్తాడని ప్రజల నమ్మకం. ఈ మందిరంలోనే చాలా కాలంపాటు ధ్యానం చేసిన నర్సింహబాబా ఇక్కడే సజీవంగా సమాధి అయినట్లు చెబుతారు. Thanks for watching ✨🤩 Don't forget to DO SUBSCRIBE ❤