У нас вы можете посмотреть бесплатно SITI CHANNEL||దేశ అభివృద్ధికి సాంకేతికతే వెన్నుదన్ను -జిల్లా కలెక్టర్ ప్రావీణ్య или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
SITI CHANNEL||నేటి విద్యార్థులు తమ ఆవిష్కరణలు, సృజనాత్మక ఆలోచనలతో భవిష్యత్లో దేశ అభివృద్ధికి దోహదపడే రేపటి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.రామచంద్రపురం మండలం కొల్లూరు గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన–2026 ను శనివారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య , టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, విఐటిఎం డైరెక్టర్ సాదు భాస్కర్, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ తరహా వైజ్ఞానిక ప్రదర్శనలనునిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు తమ రాష్ట్రాలకు ప్రతినిధ్యం వహిస్తూ పాల్గొనడం గర్వకారణ మన్నారు.ప్రతి విద్యార్థి తన విజ్ఞానం, ఆలోచనలతో దేశ భవిష్యత్తును నిర్మించే ప్రతినిధిగా ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్ ఫెయిర్లో విద్యార్థులు ప్రదర్శిస్తున్న పలు శాస్త్రీయ ప్రయోగాలు వారి సృజనాత్మకతకు నిదర్శనమని తెలిపారు. నేటి పిల్లలు ప్రశ్నించే మనస్తత్వంతో శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు..ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి విద్యార్థి ప్రతి ఎగ్జిబిట్ను పరిశీలించి, నేర్చుకుని, అనుభవం పొందాలని సూచించారు. నేటి విద్యార్థులు చేస్తున్న చిన్న చిన్న ఆవిష్కరణలే రేపటి భారతదేశానికి మార్గనిర్దేశం చేసే గొప్ప శాస్త్రవేత్తలను తీర్చిదిద్దుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు వైజ్ఞానికంగా ముందంజలో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని వసతులతో కూడిన విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశ అభివృద్ధికి సాంకేతికతే వెన్నుదన్నుగా నిలుస్తుందని, విద్యార్థులు శాస్త్రీయ నైపుణ్యాలు పెంపొందించుకుని మరింత ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, కార్పొరేటర్ పుష్ప నగేష్, అడిషనల్ కలెక్టర్ పాండు, గాడియం స్కూల్ ప్రిన్సిపల్ కీర్తి రెడ్డి, సీఈఓ రామకృష్ణారెడ్డి, విద్యాశాఖ ఆర్జేడీలు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, జూరీ సభ్యులు,డీఈఓ వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, గైడ్ టీచర్లు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.