У нас вы можете посмотреть бесплатно వెంకటగిరిలో వరుస దొంగతనాలు – పోలీసుల నిర్లక్ష్యమా? ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు దారితీస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి మునిసిపాలిటీ పరిధిలోని 1వ వార్డు బంగారు పేటలో జరిగిన గొలుసు లాక్కెళ్లిన ఘటనతో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బంగారు పేటలో స్థానికంగా నివసిస్తున్న మడకల మంజుల ఇంట్లో అర్ధరాత్రి సమయంలో ఇద్దరు గుర్తు తెలియని యువకులు చొరబడి, ఆమె మెడలో ఉన్న బంగారు సరుడును బలవంతంగా లాగి తీసుకుని పారిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో బాధితురాలు, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే, పట్టణంలో ఇటీవలి కాలంలో దొంగతనాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పోలీస్ పహారా తక్కువగా ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన దొంగతనాల కేసుల్లో కూడా పూర్తిస్థాయి దర్యాప్తు జరగలేదని కొందరు ఆరోపిస్తున్నారు. ప్రజలు పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పట్టణంలో రాత్రి పహారా బలపరచాలని, ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నివాస ప్రాంతాలు, సన్నని వీధుల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, పోలీసులు దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టి, నేరస్తులను త్వరగా పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో పోలీసులు తీసుకునే చర్యలపై పట్టణ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.