У нас вы можете посмотреть бесплатно అసెంబ్లీ లో ఎమ్మెల్యే కురుగొండ్ల... или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అసెంబ్లీలో వెంకటగిరి నియోజకవర్గ సమస్యలపై గళం విప్పిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు. రాపూరు చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పునరుద్ధరించాలి – రాపూరు ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇచ్చి ఆదుకోవాలి వెంకటగిరి,ఫిబ్రవరి 25 వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన కీలక సాగు, తాగునీటి సమస్యలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించారు. ముఖ్యంగా రాపూరు చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా అభివృద్ధి చేసే పనులు నిలిచిపోవడం వల్ల వేలాది ఎకరాలు సాగునీరు లేక బీడుభూములుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ పనులను పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2007లో చేపట్టిన సోమశిల–స్వర్ణముఖి కాలువ పనులు అటవీ అనుమతుల జాప్యం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయాయని తెలిపారు. దాంతో సుమారు 35 వేల ఎకరాలు సాగునీటి ఎద్దడిని ఆ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. రాపూరు చెరువును రిజర్వాయర్గా మార్చి ఆ భూములకు నీరు అందించాలనే లక్ష్యంతో గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదన తీసుకొచ్చారని గుర్తుచేశారు. అదే సమయంలో కండలేరు జలాశయం నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా చెన్నై తాగునీటి అవసరాలకు నీరు పంపుతూ, డక్కిలి మండలంలోని వెలికల్లు, మార్లగుంట, డక్కిలి, మోపూరు, లింసముద్రం, చెన్నసముద్రం ప్రాంతాల్లో స్లూయిస్లు ఏర్పాటు చేసి చెరువులకు నీరు మళ్లించే ప్రతిపాదనను 2014లో ప్రవేశపెట్టారని తెలిపారు. అయితే ఆ ప్రతిపాదన నేటికీ కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఆ ప్రణాళికకు ఆమోదం తెలిపితే ఈ ప్రాంతంలోని సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ఇక బాలాయపల్లి మండలంలోని మల్లెమాల, సంగవరం, గొట్లగుంట గ్రామాలకు కూడా తెలుగుగంగ నీరు అందడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఊట్లపల్లి వద్ద తెలుగుగంగ కాలువకు లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులకు నీరు మళ్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు.