У нас вы можете посмотреть бесплатно |Ramachandra Rao and Jyothi, a couple from Tadigadapa, sent ten tonnes of vegetables to Tirumala| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని తాడిగడపకు చెందిన కొల్లూరి రామచంద్రరావు జ్యోతి దంపతులు తెలిపారు. దాతల సహకారంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వారు ఆకాంక్షించారు. భక్త సమాజం తరఫున కూరగాయలు పంపడమే కాకుండా స్వామివారి కళ్యాణ మహోత్సవాలను కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి తాడిగడపకు చెందిన రామచంద్ర రావు, జ్యోతి దంపతులు పది టన్నుల కూరగాయలను తిరుమలకు పంపారు. తాడిగడపలో టిటిడి కూరగాయల రథం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిప్రపత్తులతో గోవింద నామాలను ఆలపించారు. ఈ సందర్భంగా కొల్లూరి రామచంద్రరావు, జ్యోతి దంపతులు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం తరపున 2014 నుంచి కూరగాయలు పంపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం 240వ విడత కూరగాయలు పంపే అవకాశం తమకు లభించడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. దాతల సహకారంతో అన్నదానానికి కూరగాయలు పంపే కార్యక్రమం నిరంతరం కొనసాగాలని వారు ఆకాంక్షించారు. కేవలం కూరగాయలు పంపడమే కాకుండా స్వామి వారి కల్యాణోత్సవాలను కూడా భక్త సమాజం నిర్వహించడం అభినందనీయమన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధి ఏనుగు గాంధీ బాబు మాట్లాడుతూ అన్ని దానాలలోకి అన్నదానం అత్యుత్తమమైనదని అన్నారు. అన్నదానం ద్వారానే అందరిని సంతృప్తి పరచగలమనే ఉద్దేశంతో ఈ చలసాని శ్రీనివాస్ యలమంచిలి ఈశ్వరరావు సారధ్యంలో ప్రారంభమైన ఈ మహత్తర కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నట్లు వివరించారు. ప్రసన్న లక్ష్మీ మాట్లాడుతూ తిరుమలలో జరిగే శ్రీవారి అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపటం అభినందనీయమన్నారు. హిందువుల్లో చైతన్యాన్ని నింపేందుకు మరింత మందికి తెలిసే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధులు స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూరగాయలు సమకూర్చిన రామచంద్రరావు జ్యోతి దంపతులను సాల్వాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.