У нас вы можете посмотреть бесплатно దివిసీమ ఖ్యాతి మండలి или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
కృష్ణారావు స్థాయికి నిలువుటద్దం మహాపురుషుడు మండలి నాటకం నటనతో ప్రేక్షకులను కట్టి పడేసిన కళాకారులు కృష్ణారావు పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన ఎంవీకే పాత్రధారి గంగోత్రి సాయి కళాకారులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డ: మహా పురుషుడు మండలి నాటకం కృష్ణారావు ఆయనలోని మానవత్వం, స్నేహగుణాన్ని భావితరానికి చాటిచెప్పింది. తండ్రి మండలి వెంకట్రామయ్య చూపిన బాటలో రాజకీయంగా ఉన్నత భావాలతో ఎదిగిన కృష్ణారావు ఉన్నత పదవులు అలంకరించి ఆ పదవుల ద్వారా సమాజానికి చేసిన మేలు, రాష్ట్ర అభివృద్ధిలో మండలి వారి భాగస్వామ్యం మరోసారి స్పష్టం చేసింది. బుధవారం రాత్రి అవనిగడ్డ గాంధీక్షేత్రంలో దివిసీమ గాంధీ, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో మహాపురుషుడు మండలి నాటక ప్రదర్శన ఆసాంతం ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రదర్శన ప్రారంభం నుంచి చివరి వరకూ ఒక్కరు కూడా కదలకుండా కూర్చుని ఉండిపోయి తమ కళ్ళ ముందు కదలాడుతున్న మండలి వెంకట కృష్ణారావును, ఆయన మాటలను వింటూ అలా చూస్తూ ఉండిపోయారు. అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారిచే గంగోత్రి సాయి దర్శకత్వంలో డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన ఈ మహాపురుషుడు మండలి నాటకంలో కృష్ణారావు యుక్త వయసులో ఎంపీగా ఎన్నిక కావటం, ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేసిన గొప్ప పనులు, పూల దండలు వేయించుకోవద్దని తీసుకున్న నిర్ణయం, ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్న ఘట్టం అద్భుతంగా ప్రదర్శించారు. దివిసీమ ఉప్పెన రావటం, అది చూసి కృష్ణారావు తల్లడిల్లిపోయిన దృశ్యాలు, స్నేహితుడు భూషయ్య కనిపించక కృష్ణారావు పడిన వేదన ఫ్రెండ్ సెంటిమెంట్ అద్భుతంగా ఉంది. దివిసీమ ఉప్పెన మృతులను చూసి విషాదాన్ని తట్టుకోలేకపోయిన కృష్ణారావు సహాయక చర్యలు చేపట్టి, మంత్రి పదవి ఉంటే ఇక్కడి నుంచి సభలకు బయటకు వెళ్లాల్సి వస్తుందని, పూర్తి సమయం దివిసీమకే కేటాయించేందుకు మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధపడటం, అది తెలుసుకుని ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వారించి, అదనంగా సహాయ పునరావాస శాఖను కూడా నూతనంగా ప్రవేశపెట్టి దానికి కృష్ణారావునే మంత్రిగా చేసిన దృశ్యాలు నాటి ఉన్నత రాజకీయాలకు ప్రతీకగా నిలిచాయి. దర్శకుడు, నటుడు గంగోత్రి సాయి కృష్ణారావు పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణారావు ఆవహించారా.. అన్నట్లుగా అచ్చం కృష్ణారావు లాగానే నడిచి, కృష్ణారావు లాగానే మాట్లాడి, కృష్ణారావు లాగానే కనిపించి ప్రతి ఒక్కరి అభిమానం చూరగొన్నారు. ప్రభావతమ్మ పాత్ర, కృష్ణారావు యుక్త వయసు పాత్రలు, వెంకట్రామయ్య పాత్ర, బుద్ధప్రసాద్ బాల్య దశ పాత్ర ఇలా ప్రతి పాత్రలో కళాకారులు చక్కని నటనతో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం కళాకారులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ - విజయలక్ష్మి దంపతులు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఘనంగా సత్కరించారు.