У нас вы можете посмотреть бесплатно Ade Choodu Tiruvenkatadri - Annamayya Sankeerthana(అదెచూడు తిరువేంకటాద్రి -అన్నమయ్య సంకీర్తన) lyrics или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అదెచూడు తిరువేంకటాద్రి - అన్నమయ్య సంకీర్తన (AdeChoodu Tiruvenkatadri - Annamayya Sankeerthana) Singer - SP Balasubramanyam garu (Courtesy - TTD & Sri Venkateswara Recording Project) Lyrics - అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము లందు వెలుగొందీ ప్రభ మీరఁగాను తగ నూటయిరువై యెనిమిది తిరుపతుల గల - స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన దేశాంత్రుల మఠంబులును నధికమై చెలువొందఁగాను మిగులనున్నతములగు మేడలును మాడుగులు మితిలేని దివ్యతపసులున్న గృహములును వొగి నొరగుఁ బెరుమాళ్ళవునికి పట్టయివెలయు - దిగువతిరుపతి గడవఁగాను పొదలి యరయోజనము పొడవుననుఁ బొలుపొంది పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి చెదరకే వంక చూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సురవరలు కిన్నరులు కింపురుషులును..... గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంతదేశముల వేడుకలు దైవారగాను యెక్కువల కెక్కువై యెసఁగి వెలసిన పెద్ద- యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీఁద అక్కజంబైన పల్లవరాయని మటము అలయేట్లపేడ గడవన్ చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచి మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచిన మీఁద- నక్కడక్కడ వేంకటాద్రీశు సంపదలు అంతంతఁ గానరాఁగాను బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును పొందైన నానావిధంబుల వనంబులును నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల- నీడలను నిలిచి నిలిచి గగనంబు దాఁకి శృంగార రసభరితమై - కనకమయమైన గోపురములనుఁ జెలువొంది జగతీధరుని దివ్యసంపదలు గల నగరు సరుగననుఁ గానరాఁగాను ప్రాకటంబైన పాపవినాశనములోని భరితమగు దురితములు పగిలి పారుచునుండ ఆకాశగంగ తోయములు సోఁకిన భవము లంతంత వీఁడి పారఁగను యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును- లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో యేకమై తిరువేంకటాద్రీశుఁడాదరిని యేప్రొద్దు విహరించఁగాను భావ వివరణ: అదె చూడు (అదిగో చూడండి) నాలుగు యుగాలనుండి వెలుగొందుతున్న శ్రీవేంకటాద్రి ప్రభమీరగాను (వైభవము అతిశయించగా) శోభిల్లుచున్నది. ఈ దేవదేవుని సేవించుటకు నూట ఇరవై ఎనిమిది తిరుపతులలోగల స్థానికులందరూ విచ్చేసినారు. చక్రవర్తి పీఠమునధిరోహించిన అనేకులు విచ్చేశారు. లెక్కలేనంతమంది దేశాంతరమఠాధిపతులు అధికముగా కిక్కిరిసినట్లు విచ్చేశారు, ఇక ఆ తిరుమలకొండ దిగువన తిరుపతి పట్టణమున్నది. అక్కడ మేడలు మిగులనున్నతములు (చాలా యెత్తయినవి), చక్కని మాడుగులు (సౌధములు) వున్నవి. తరగని దివ్యతపస్సులను చేసే అనేక గృహములు ఆ వూరిలో వున్నాయి. ఒగి నొరగు (వినమ్మలై ఒంగి నమస్కరించు) పెరుమాళ్ళకు (వేంకటేశ్వరస్వామికి) వునికిపట్టయిన (ఆవాసమై) వెలసివున్నదా తిరుపతి. ఇక ఆ తిరుమల కొండయెలావున్నదంటే... అది పొదిలి అరయోజనము పొడవున పొలుసందును (అడ్డముగా ఆ కొండ వెడల్పు అరయోజనము అనగా నాలుగు మైళ్ళు వుంటుంది). ఆ కొండ చుట్టుకొలత దాదాపుగా పదకొండు యోజనాలు లేక ఎనభై ఎనిమిది మైళ్ళు వుంటుంది. ఆ కొండపై యేవైపు చూచినా, మహాభూజములు (గొప్ప వృక్షములు కనబడతాయి). అనేక సింహములు పులులు కూడా ఆ కొండపై వున్నాయి. కదిసి (చేరువయై) ఆ కొండ మీద అనేక సురవరులు (దేవతాప్రముఖులు) వుంటారు. కాకపోతే వారు మనవంటి మానవులకు కనుపించరు. ఆ దేవగణములలో అనేక మంది కిన్నరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, యక్షులు విద్యాధరులు విదితమై (బాహాటంగా) విశ్రాంతి ప్రదేశములలో విహరిస్తుంటారు. వారంతా వేడుకలదైవారుతుంటారు (మునిగి తేలుతుంటారు). ఎక్కువలకెక్కువై (ఎక్కుటకు యెంతో ప్రయాసకరమై) అతిశయముగా వెలసిన కొండ. ఎట్లాగో శ్రమలకోర్చి దానినెక్కినంత, దానిమీద ఆశ్చర్యకరమైనట్టి పల్లవరాజుల మఠము దర్శనమిస్తుంది. ఆ ప్రాంతాన్ని ఏడగ అంటారు. అక్కడనుంచి తిన్నగా వెళ్ళితే 'నవ్వచరి' అనే ప్రాంతం వస్తుంది. దాన్ని దాటి గోవిందా! ఏడుకొండలవాడా! వేంకటరమణా! గోవిందా! అని హరినామ సంకీర్తన చేస్తూ, మొక్కుతూ మోకాలృముడుగు (మోకాళ్ళపర్వతం) చేరుతాం. దాన్ని గడచిన మీదట (యెక్కిన తరువాత) అక్కడక్కడ వేంకటేశ్వరుని ఆలయ ఘోష లీలగా వినబడుతుంటుంది. ఆలయ వైభవం అంతంత (అక్కడల్లంతదూరాన్నుంచే) గానరాగా (కనబడుతుంటే) ఆనందంతో ఒళ్ళు పులకరిస్తుంటుంది. శ్రమ ఫలించబోతున్న అనే ఆనందంతో ఉత్సాహం ఉరకలు వేస్తుంటుంది. అక్కడ, బుగులుకొను పరిమళంబులు (వ్యాపించెడి సువాసనలను) వెదజల్లు పూలతోటలు కనువిందు చేస్తాయి. పొందుగా శోభిల్లుతున్న నానావిధములైన తోటు కనువిందు చేస్తాయి. పెద్దపెద్ద పండ్లు బాగా పండిన ఫలములు కిక్కిరిసి దట్టముగానున్న వృక్షములు అటు ఆకలిని తీరుస్తాయి, ఇటు సేదతీరే నీడను ప్రసాదించి యెండను తట్టుకొనేట్లు చేస్తుంది. అక్కడ కనువిందు చేసే విధంగా ఆకాశమునంటు శృంగార రసభరితమైన బంగారు గోపురములు దర్శనమిస్తాయి. అక్కడనుంచి శోభాయమానమైన జగతీవరుని (భూకాంతుని) దివ్యసంపదలు వైభవాన్ని చాటే తిరుమల దర్శనమిస్తుంది. సరుగున ఆ విధముగా వర్ధిల్లుతూ ఆయల దర్శనము కలుగుతుంది. ఆచోట, ప్రాకటంబై (ప్రసిద్ధమై) పాపవినాశనము అను జలపాతము పరమపునీతమై ప్రవహించుచుండును. అందులో స్నానము చేసినవారి పాపములన్నియు పటాపంచలైపోవును. ఆ ప్రాంతాలలోనే కల ఆకాశగంగ అను యెత్తైన జలధారలో పవిత్రస్నానమాచరించిన కలిగే పుణ్యం చెప్పనలవికాదు. ఆ నీరు మనవంటిని సోకినంతనే భవములన్నియు (పుట్టుకలకు మూలకారణమైన పాపములన్నియు) పటాపంచలైపోవును. ఇదిగో ఈ దివ్యమైన స్వామి పుష్కరిణి అనే కోనేరు. ఆనందనిలయమున కెదురుగానున్న దీనిలో యతీంద్రులు, పాశుపతి (పరమశివుడు) మునులు, అగ్గలమై (అధికముగావున్న) వైష్ణవులతోపాటు మేమును, యేకమై స్నానాదికములాచరించి తరించితిమి. అదిగో ఆనందనిలయ స్వర్గశిఖరము. శ్రీవేంకటేశ్వరుని పవిత్ర నివాసమదియే. ఆ దరిని (ఆ తావులో) ఆయన యెప్పుడూ విహరిస్తుంటాడు. (సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)