У нас вы можете посмотреть бесплатно ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు పై గరికపాటి నరసింహారావు మాటలు అర్ధరహితం..! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఆంధ్రప్రదేశ్ పేరులో ప్రదేశ్ ను తొలగించి ఆంధ్ర రాష్ట్రం గా మార్చాల్సిందే . తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హిందీ పదంతొ ఆంధ్రులను అవమానించటం తగదు . ఎంటీఆర్ తెలుగునాడు గా ప్రకటించాలనుకున్న పేరు ను ఎంటీఆరే ఉపసంహారించుకున్నారు . ********************** పండిత పర్వం ఖ్యాతిని పెంచేలా ఉండాలి . దిగజార్చుకునేలా ఉండరాదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూచించారు .. గరికపాటి నరసింహారావు వారికి వేదం పైన , రామాయణ , హితిహశాల పట్ల ఎంతో పట్టు గల పండితులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు . ఈ మధ్య కాలంలో గరికపాటి వారికి అస్సులు సంబంధం లేని వాటిపై కొన్ని వ్యాఖ్యానాలు చేస్తు ఆపకీర్తికి గురవుతున్నారు . హిందూ ధర్మం పవిత్రత కోసం , ఆ ధర్మం యొక్క శక్తి సామర్థ్యల కోసం ఎంతగానో జ్ఞానోదయం గల గరికిపాటి గారు ఈ మధ్య పురాణ పురుషులును , దేవ దేవతలను ఏకవచనంతొ శంభోదిస్తు తన ఆహాన్ని , తన అహకార ఉపన్యాసాలను బోదిస్తున్నారు . గరికపాటి ప్రసంగాలు హిందూ మనోభావాలను గాయ పరుస్తున్నట్టుగా వుంటున్నాయి . అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టి ఆధ్యాత్మక విభాగం ప్రతినిధిగా ఉపన్యాసాలు గుప్పిస్తు ఆ ముసుగులో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు . పీఠధిపతులు, మత ఉద్బోదకులు సామజిక చైతన్యాన్ని , హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పేవిగా ఉండాలి . ఉన్మాదాన్ని ప్రేరేపించే విధంగా ఉండకూడదని ఆయన హితవు పలికారు . పండిత బిరుదాన్కితులైన గరికపాటి వారికి ఆంధ్ర ప్రాశిసత్యం కోసం , చరిత్ర మూలాలు కోసం , పౌరాణిక పవిత్రత , పోరాటాల కోసం తెలియ వంటారా ! తెలిసే ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా ప్రకటించమని గరికపాటి దుందుడుకు ప్రకటన చేస్తున్నారా ! తమిళనాడు రాష్ట్ర పేరును , ఈ మధ్య కేరళం పేరును మార్చుకున్నారు . అందుకని కొంతమంది మేధావులుగా పేర్కొంటున్న వారు ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెలుగునాడుగా మార్చుకోవాలని గరికపాటి తదితర మేధావులు ఎక్కువగా అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు . ఆంధ్ర రాష్ట్ర చరిత్ర , గొప్పతనం , ఆ పేరులో గల శక్తి తెలియక అసందర్బ మాటలుతో గరికపాటి వంటి మేధావులు , వారి అనుంగ సేనలుతొ ఆంధ్రరాష్ట్ర ప్రతిష్ట దిగజారే ప్రమాదం వుందని ఆయన ఆవేదన చెందారు . ఆంధ్ర అనే నామం రామాయణ , మహాభారత కాలానికి ముందునుండి ఆచరణలో వుందని గరికపాటి వారు గ్రహించాలి . ఆదికవి నన్నయ్య ఆంధ్ర మహాభారతం గాను , ఆధునిక కవిత్వాన్ని అచ్చు వేయించిన బమ్మెర పోతన వంటి మహనీయులు ఆంధ్ర మహాభారతం , శ్రీ మద్ ఆంధ్ర భాగవతం గానే పురాణ కాల నిజాలను వ్రాసారు అని గరికపాటి వారు గుర్తించాలి . 12 వ శతబ్దనికి ముందు తెలుగు అనే పద ఉచ్చారణ లేదు . పురాతన గ్రంధాల్లో సైతం ఆంధ్ర పద ఉచ్చారణ వుందని తెలుసుకోవాలి . బాష (తెలుగు), జాతి , ప్రదేశం , సంస్కృతి కలిసిన సమైక్యతకు వారధిగా ఆంధ్ర పద ఉచ్చారణ దైవ సంకల్పంతొ ఆవిర్బవించిన పదమే ఆంధ్ర అని గరికపాటి వంటి మేధావులు ఆలోచింప చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టకు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన హితబోధ చేసారు . ఆంధ్ర పద ఉచ్చారణకు పురాణకాల చరిత్రతొ పాటుగా ఉద్యమ చరిత్ర కూడా వుంది . నిజాం కాలంలో జరిగిన అనేక పోరాట పోరు బాటల్లో ఆంధ్ర అనే పదం లేకుండా ఉద్యమాలే లేవు . ఆ కోణం లోనే ఆనాడు " ఆంధ్ర మహాసభ " ఆవిర్బవించిందన్నారు . ఆంధ్ర పదంను తొలగించమని నిజాం పాలనలో ఎన్ని ఒత్తిడిలు , వేధింపులు వచ్చినా ఆంధ్ర పదంను తొలగించలేదనేది జగమెరిగిన నిజం . తొలి రాష్ట్ర విభజన సమయంలో మద్రాస్ రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలని కర్నూల్ రాజధాని గా విడిపోయింది ఆంధ్ర రాష్ట్రం గానేనని గరికపాటి వారు మరువరాదు . పొట్టి శ్రీరాములు, టంగుటూరు ప్రకాశం పంతులు త్యాగాలతో ఏర్పడిన విభజన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గానే విడిపోయిందని మేధావులు , పండితులు గమనించాలి . ఆంధ్రుకరించారు అనే ఉచ్చారణ నుండి పురుడు పోసుకున్న పదమే తెలుగు నామం అన్నారు . నిజాం నిరంకుసత్వం పై జరిపిన పోరుబాటలో కూడా ఆంధ్ర పదం తొలగించటం కుదరదు అని నాటి కమ్యూనిస్ట్ లు సైతం ఆంధ్ర మహాసభ వేదికగ జరిగిన ఉద్యమాల్లో అండగా నిలిచారాని ఆయన గుర్తు చేసారు . గరికపాటి వారి పండిత నైపుణ్యాన్ని హిందూ ధర్మం కోసం , ఖ్యాతి కోసం మాత్రమే ఉపయోగించగలరని , ఈ దేశానికి మోదీ ఒక్కడే ఉత్తముడు, ఆంధ్రప్రదేశ్ పేరు మార్చి తెలుగునాడుగా ప్రకటించండి అంటు మిమ్మల్ని అనుసరిస్తున్న వారికి మీ భోదనగా చెప్పి ఆంధ్ర ప్రతిష్టకు మకిలి పట్టించకండి . భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కుత్రిమ వ్యాధి ఒక్క ఆంధ్రరాష్ట్రం లోనే కొంతమందిలో వుంది . గరికపాటి వంటి మేధావులు , సినిమా వారు ఏది చెప్పినా వినటమే పనిగా ఆంధ్ర రాష్ట్రంలో మానసిక వైఖల్యం పెరిగిపోయింది . అనుసరించే వారు భక్తి మార్గం గాను, వినోదపు మాయా జాలం లోను ఒక రకమైన మత్తులో ప్రజల సొంత మేధస్సు ను నిర్వీర్యం చేసుకుంటున్నారు . గరికపాటి కొన్ని సందర్భాల్లో పవిత్ర రామాయణ, మహాభారతం కోసం కూడా వ్యంగ్యంగా ఛలోక్తులు చేస్తు భక్తి సూక్తులను ఆశ్యం చేస్తున్నారు . ఈ మీడియా సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ లంక దుర్గా ప్రసాద్ , పెండ్యాల కామరాజు, సిమ్మా దుర్గారావు , దుడ్డే త్రినాద్ , బర్ల ప్రసాద్ , వర్ధనపు శరత్ కుమార్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , కొల్లి సత్యనారాయణ, కాకర ప్రసాద్ , ఎస్ కే దేవి, మేకా అయ్యప్ప , కంతి రమాకాంత్ తదితరులు పాల్గొనియున్నారు .. --మేడా శ్రీనివాస్ , MA, LLM, MA(జర్నలిజం) MA(Mjmc), అధ్యక్షులు , రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ .. మొబైల్ : 9248777222 ..