У нас вы можете посмотреть бесплатно వెంకటగిరి చికెన్ పకోడా షాపులపై అధికారులు దాడులు... или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#chicken#chickenpakoda #venkatagiri వెంకటగిరి చికెన్ పకోడా షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు... ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ పాల మరణాలపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలో భాగంగా తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ మద్దులేటి వెంకటగిరి పట్టణంలోని చికెన్ పకోడా దుకాణాలపై దాడులు నిర్వహించారు. కేజీ చికెన్ 300 రూపాయలు ఉండగా తయారుచేసిన చికెన్ పకోడా మాత్రం 250కే విక్రయించడంతో అధికారులకు ఏమీ అర్థం కావడం లేదు.. ఇది ఎలా సాధ్యమవుతుందని అధికారులు కంగుతున్నారు... అయితే ఇందులో చనిపోయిన కోళ్లను తెచ్చి చికెన్ పకోడీగా తయారుచేసి విక్రయాలు జరుగుతున్నారని అనుమానాలు రేకెత్తాయి... మొదటిగా వెంకటగిరి పట్టణంలోని పాత కైవల్య వంతెన సమీపంలో నిర్వహిస్తున్న చికెన్ పకోడా షాపుపై దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తుండడంతో ఆ దుకాణంలోని చికెన్ సామాగ్రితో పాటు నూనె తదితర వస్తువులను నిర్విరం చేసి పరీక్షల కొరకు కొంత చికెన్ పకోడాను సేకరించి జప్తు చేశారు. విచారణ అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీలలో భాగంగా పాత బస్టాండ్ లోని మరో చికెన్ పకోడా దుకాణం వద్దకు వెళ్ళగా అధికారుల రాకను గమనించిన దుకాణదారుడు హుటా హుటానా దుకాణాన్ని మూసివేసి అక్కడనుండి వెళ్లిపోవడంతో ఖంగుతిన్న అధికారులు ఈ షాప్ కి మళ్లీ వస్తానని చెప్పి వెనుతిరిగారు. అయితే ఈ చికెన్ షాప్ యజమాని నిజాయితీగా చికెన్ పకోడా అమ్ముతుంటే ఎందుకు అధికారులు చూసి భయపడి దుకాణాన్ని మూసి వెళ్లాల్సి వచ్చిందో తెలియాలి. ఇందులో బ్రతికిన కోళ్లతోపాటు పాటు చచ్చిన కోళ్లను కూడా అమ్ముతున్నాడా లేదా అనే విషయం మీరే అర్థం చేసుకోవాలి.... ఈ దాడులలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మరియు వారి సిబ్బంది పాల్గొని విచారణ చేపట్టారు. కల్తీ పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ స్థానిక ప్రజలను కోరారు...