У нас вы можете посмотреть бесплатно |CM Chandrababu Naidu said that the sacrifice of the immortal Potti Sriram is an inspiration| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అమరజీవి పొట్టి శ్రీరాముటు త్యాగంమనందరికీ స్పూర్తి దాయకమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం. ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారన్నారు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీక్షంలో 6.8 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ స్మృతివనంలో అమరజీవి 125వ జయంతి వేడుకలను భారీస్థాయిలో నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రినారా లోకేష్ సహా పలువురు మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యలు పాల్గొని అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములుకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్ఫూర్తి అని తెలిపారు. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం.. ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారన్నారు. ఆ అమరజీవిని స్మరించుకుంటూ ఘననివాళి అర్పిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు