У нас вы можете посмотреть бесплатно గుంటూరులో భద్రతా చర్యలలో భాగంగా రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
/గుంటూరు జిల్లాలో ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్ మరియు APSRTC బస్టాండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా భద్రత విభాగ పోలీసులు,.// 📍 మొన్న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడు ఘటన దృష్ట్యా, జిల్లా పోలీస్ వ్యవస్థను అప్రమత్తం చేస్తూ, జిల్లా వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, ప్రజా రక్షణ కొరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు ఆదేశించారు. 🚩 ఈరోజు (12.11.2025) గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ. హనుమంతు గారి ఆధ్వర్యంలో, జిల్లా భద్రత విభాగం (District Security Wing) ఆధ్వర్యంలో గుంటూరు రైల్వే స్టేషన్ మరియు APSRTC బస్టాండ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. 📍 ఈ తనిఖీలను ప్రేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, ఇతర ప్రమాదకర పదార్థాల గుర్తింపు మరియు నిర్వీర్యం చేసే శిక్షణ పొందిన పోలీస్ సిబ్బంది, ప్రత్యేక జాగిల బృందాలతో కలిసి నిర్వహించారు. 👉 గుంటూరు రైల్వే స్టేషన్ లో అదనపు ఎస్పీ శ్రీ ఏ. హనుమంతు గారు, కొత్తపేట సీఐ శ్రీ వీరయ్య చౌదరి గారు, జిల్లా ఎం.టి. ఆర్.ఐ. శ్రీహరి రెడ్డి గారు, ప్రభుత్వ రైల్వే పోలీస్ RSI జ్యోతి గారు, ఇతర అధికారులు, జిల్లా భద్రత విభాగం సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు. ❇️ ఈ తనిఖీలలో రైల్వే స్టేషన్ పరిసరాలు, తినుబండారాల దుకాణాలు, ఇతర స్టాళ్లు, ప్రయాణికుల సామాను, ఆటో స్టాండ్, బైక్ స్టాండ్ ప్రాంతాలను బీడీ (Bomb Detection) టీమ్ మరియు పోలీస్ జాగిలాలతో పూర్తిగా పరిశీలించారు. ఏవైనా అనుమానిత పదార్థాలు, వస్తువులు లేదా అనుమానిత వ్యక్తులు ఉన్నారేమో అనే దృష్ట్యా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ❇️ ఇదే విధంగా, APSRTC బస్టాండ్ లో జిల్లా వెల్ఫేర్ ఆర్.ఐ. శ్రీ సురేష్ గారి ఆధ్వర్యంలో, జిల్లా భద్రత విభాగానికి చెందిన శిక్షణ పొందిన జాగిల బృందాలతో కలిసి పార్సిల్ బుకింగ్ కౌంటర్లు, ప్రయాణికుల లగేజీలు, స్టాళ్లు తదితర ప్రాంతాలను పరిశీలించారు. పార్సిల్ వివరాలు, రవాణా మార్గాలు మరియు రవాణా చేసే వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి భద్రతా పరమైన చర్యలు చేపట్టారు. ❇️ అనుమానిత లేదా ప్రమాదకర వస్తువుల రవాణాను అరికట్టి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా ఈ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని లేదా డయల్ 112 ద్వారా సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 🔰 గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని, రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్లలో ఇప్పటికే పటిష్ట నిఘా ఏర్పాటుచేసి, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణతో పాటు పోలీస్ సిబ్బంది గస్తీ కొనసాగిస్తున్నారని జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ. హనుమంతు గారు తెలిపారు. #GunturPolice #AndhraPradeshPolice #GunturDistrict #GunturSP #VakulJindalIPS #GunturRailwayStation #GunturBusStand #DistrictSecurityWing #PoliceInspection #SecurityCheck #PublicSafety #BombDetectionTeam #PoliceDogs #APSRTC #RailwaySecurity #SafeGuntur #PublicAwareness #Dial112