У нас вы можете посмотреть бесплатно శ్రీ సింహచల క్షేత్రంలో ఏపీ హైకోర్టు గౌరవ న్యాయమూర్తి శ్రీ వి. శ్రీనివాస్ గారు స్వామివారి దర్శనం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచల క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులైన శ్రీ జస్టిస్ వి. శ్రీనివాస్ గారి స్వామివారి దర్శనం సింహాచలం,4 జనవరి 2026. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులైన శ్రీ జస్టిస్ వి. శ్రీనివాస్ గారు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం లభించింది. ఆలయానికి విచ్చేసిన గౌరవ న్యాయమూర్తి గారికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. సుజాత గారు, సహాయ కార్యనిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి మరియు పర్యవేక్షణ అధికారి బి. సత్య శ్రీనివాస్ గారు సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు నాదస్వర మేళతాళాల నడుమ, వేదమంత్రోచ్ఛారణలతో వారికి 'పూర్ణకుంభ' స్వాగతం పలికి ఆలయ ప్రవేశం చేయించారు. అనంతరం గౌరవ న్యాయమూర్తి గారు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టతను వారికి వివరించారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు జస్టిస్ వి. శ్రీనివాస్ గారికి శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనము అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో వారిని ఘనంగా సత్కరించి, ఆలయ కార్య నిర్వహణ అధికారి స్వామివారి ప్రసాదాలను మరియు చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, ఇతర అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.