У нас вы можете посмотреть бесплатно త్రేతాయుగ శబరి మళ్ళీ పుట్టింది,తాడ్వాయి శబరిమాత,3ఏళ్ల వయసు నుండి సాధన,thadvayi shabari matha или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#shabari#అవధూత#avadhootha#thadvayi shabari#andryogulu#2025 🚩🚩🚩🙏🚩🚩🚩 తాడ్వాయి శబరిమాత (1945 - 2000) (అసలు పేరు) తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగలక్ష్మి. మెదక్ జిల్లా తొగిటే గ్రామం తల్లిదండ్రులు- తూముకుంట మల్కయ్య ,వీరమ్మ. దీనికి ఎనిమిది మంది సంతానం. వృద్ధాప్యంలో అష్టమ గర్భం కలిగింది . ఏడవ నెలలో అమ్మకు జన్మనిచ్చారు. ఒక సాధువు వీరమ్మ గారికి స్వప్నంలో దర్శనమిచ్చి విభూతిని ఇచ్చారు బిడ్డ పుట్టిన తర్వాత నాగలక్ష్మి అని పేరు పెట్టమన్నారు. .అమ్మ గర్భంలో ఉన్నప్పుడే రామ రామ అంటూ ఓంకారం చేయడం మొదలుపెట్టారు. మూడేళ్ల వయసు నుండి వారి సాధన మొదలుపెట్టారు వీరు హఠయోగి. చిన్నతనం నుండే ఎన్నో లీలలు ప్రదర్శించారు. వీరి అన్న వీరికి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఇంటి నుండి పారిపోయి అడవులకు వెళ్లారు. రాముడు లేని జీవితం వ్యర్థం అని విరక్తితో రామున్ని స్మరించి ప్రవాహంలో దూకితే ఒక యోగి కాపాడారు. సాక్షాత్తు సరస్వతి దేవి ప్రత్యక్షమై అమ్మ నాలుకపై బీజాక్షరాలు వ్రాశారు. అప్పటినుండి అమ్మ వాగ్దాటి గంగా ప్రవాహం అయినది. అడవిలో ఉండగా ఒక తెలియని వ్యక్తి వచ్చి ఒక ఫలాన్ని తేనెను తినమని ఇచ్చారు అప్పటినుండి అమ్మకి ఆకలి దప్పుల బాధలు లేవు. అమ్మకి అడవిలో దిగంబర సిద్ధయోగి దర్శనం కలిగినవి వారు ఏమైనా కోరుకొమ్మన్నప్పుడు ఆమె భక్తి జ్ఞాన వైరాగ్యమును తప్ప ఏమీ వద్దు అని కోరుకున్నది అప్పుడు వారు మంత్ర ఉపదేశం చేశారు అప్పటినుండి అమ్మ ఒక గుహలో సాధన చేస్తున్నంత కాలం గుహబయట ఒక భల్లూకం కావలి ఉండేది. మళ్లీ గురువు ప్రత్యక్షమై సాంఖ్య తారక అమనస్కా యోగములు కుండలినీ విద్య బ్రహ్మ సమాధినిష్ట బోధించారు మళ్లీ ఆమె తన గుహ చేరి సాధన కొనసాగించింది. వారి చుట్టూ పుట్టలు చెదలు పెరిగి శరీరం కొంత శిథిల మైనది అయినా చలించక కృషించి యోగశక్తి విజృంభించింది. ఇలా ఏడు సంవత్సరాలు కఠిన తపస్సు చేశారు. ఆ తర్వాత మళ్లీ గురువు ప్రత్యక్షమై యోగము ఫలించినదని జపతపాలు చాలించాయని మానవులకు సన్మార్గం బోధ చేయమని ఆదేశించారు. ఒకరోజు వీరి దగ్గరికి ఒక దివ్య సర్పం వచ్చి పోశాకృతిలో నిలిచి నీవు మా జాతి దానవు నాతో నాగలోకానికి రా దివ్యలను దర్శించు అన్నారు అప్పుడు ఈమె ఏ విధంగా రాను నేను అని అనగానే వీరు కూడా సర్పరూపంగా నుంచి నాగలోకానికి చేరారు అక్కడ దివ్య దర్శనం చేసి వారి దీవెనలు పొంది బోధలు విని యధా రీతిగా తానున్న స్థలలో కండ్లు తెరిచి చూస్తే అక్కడ ఒక సర్పం ఉన్నది. (అంటే ఇది కల కాదు అని అర్దం) గురువు ఆదేశం ప్రకారం తీర్థయాత్రలు చేస్తూ శ్రీశైలంలో మూడు నెలలు తపస్సు చేసి భ్రమరాంబిక మల్లికార్జున సాక్షాత్కారం పొందింది. మాణిక్య ప్రభువుల సమాధిని గానుగాపురం నరసింహ సరస్వతి బాదుకలను పండరి విటలుడిని దర్శించింది. దక్షిణ దేశ తీర్థయాత్రలు చేసింది. ఆ తరువాత ఉత్తరదేశ యాత్రలు చేస్తూ, నైమిశారణ్యంలో ఒక యోగిని కలిసి ఆమె వర్తమానం తెలుసుకొని రామ భక్తుడాలైన శబరి మళ్లీ జన్మించింది ఈ యోగిని శబరి నామముతో సత్కేర్తితో విరాజిల్లు గాక అని ఆయోగి దీవించాడు అప్పటినుండి యోగిని నాగలక్ష్మి శబరిమాతగా ప్రసిద్ధి పొందింది. ఆ తరువాత ఆరు సంవత్సరాలు అమ్మ తాడువాయిగూడెంలో ఉండి ప్రజలకు దర్శనం ఇచ్చింది అక్కడివారు అమ్మకు ఆశ్రమం కట్టారు లక్షల సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించి తమ ఆర్తిని బాపుకునేవారు. అమ్మ విగ్రహం సన్నగా చిన్నగా నాలుగు అడుగులు ఉంటుంది. చూడటానికి 10 ఏండ్ల బాలిక వలె కనిపిస్తుంది. నిరంతరం రామనామ స్మరణ తప్ప అన్నిమెరుగనిది జననం మరణం రాముని అధీనం అని భావించినది 13-4-2000. శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం శ్రీ సీతారామ కళ్యాణం కన్నులారా చూసి 3:30 ని "కు సిద్ది పొందినది. 🚩