У нас вы можете посмотреть бесплатно దుర్గమ్మ ఆలయానికి కుంభాభిషేక శోభ ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు | C NEWS или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఈనెల ఆరవ తేదీ నుండి ప్రారంభం కానున్న శ్రీ దుర్గమ్మ ఆలయ కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. భక్తులకు అమ్మవారి దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం లో ఉత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం తాగునీరు అన్న ప్రసాద పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల ఆరవ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న ఈ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయం చుట్టూ పరంజా, బల్లలతో ఏర్పాట్లు జరిగాయి. అన్ని నదులు, సముద్రాల పవిత్ర జాలలతో శిఖరాభిషేకం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఇన్చార్జి డిసిపి గున్నం రామకృష్ణ తదితరులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. కామధేను అమ్మ వారి ఆలయం నుండి ఘాట్ రోడ్డు క్యూ లైన్ల తో పాటు ఆలయంలో అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుధ్యం తాగునీరు అన్న ప్రసాద పంపిణీలలు ఎలాంటి లోటుపాట్లు రాకూడదన్నారు. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా ప్రతిష్టనిగా ఏర్పాటు చేయాలని ట్రాఫిక్కు క్రమబద్ధీకరించాలని క్యూ లైన్ లో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థాన ఈవో శీనా నాయక్, బొర్ర రాధాకృష్ణ మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు వేయిస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు భక్తులకు ప్రశాంతంగా దర్శనం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కుంభాభిషేకం మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సక్రమంగానే జరుగుతున్నాయని వారు తెలిపారు.