У нас вы можете посмотреть бесплатно ప్రరవే రాష్ట్ర మహాసభలు కర్నూలు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ప్రజాస్వామిక రచయితరుల వేదిక ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు కర్నూలు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం(07.02.2026) ఉదయం నగరంలోని కెవిఆర్ కళాశాలలోని అనిశెట్టి రజిత ప్రాంగణంలో ద్రావిడ సమాజ సాహిత్యాలు సారూప్యత ఐక్యత పోరాటం పేరుతో ఈ సభలను ప్రారంభించారు. ప్రారంభానికి ముందు ప్రజాస్వామ్యక రచయితల వేదిక జాతీయ కార్యదర్శి డాక్టర్ ఎండ్లూరి మానస, జాతీయ నాయకులు , కుంజా కళ్యాణి, రాజ్యలక్ష్మి, మారుతి పౌరోహితం, కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి పతాకావిష్కరణ చేశారు. ప్రారంభ సభకు కీనోట్ ప్రసంగాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక పూర్వ సంపాదకులు ప్రముఖ రచయిత కే శ్రీనివాస్ అందించారు. ద్రావిడ భాషల పట్ల అవగాహన పెరుగుతుందని ఒకరకంగా ద్రావిడ భాష ఉద్యమం రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. ద్రవిడ భాషల్లో విస్తృతమైన సాహిత్యం ఇప్పటికే లభిస్తున్నదని అయితే లిపిలేని భాషల పట్ల మరింత పరిశోధన కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పరస్పరం భాష సాహిత్య కార్ల మధ్య సాహిత్యం పెరిగే వాతావరణం ఈ శతాబ్దం చూస్తున్నదని అన్నారు. ప్రారంభ సభలో అంబేద్కర్ _1 పుస్తకాన్ని ప్రముఖ కవి జి వెంకటకృష్ణ ఆవిష్కరించారు. పుస్తకాన్ని మెట్టు రవీందర్ సమీక్షించగా సభను సింగరాజు రమాదేవి నిర్వహించారు. అనంతరం అనిశెట్టి రజిత స్మారకోపన్యాసం ప్రముఖ సాహితీవేత్త కాత్యాయని విద్మహే ఇచ్చారు. ద్రవిడ భాషా సమాజంలో అన్య భాషల ప్రమేయం వల్ల జాతి మనుగడకే ప్రమాదం అని అన్నారు. బలవంతంగా ద్రవిడ సమాజంలో ఇతర భాషలను మన భాషల్ని పడేస్తున్నారని అన్నారు. సభను డాక్టర్ ఏ విద్యా దేవి నిర్వహించారు. అనంతరం జరిగిన మొదటి ప్రసంగంలో ద్రావిడ భాషా కుటుంబం ప్రాచీన సాహిత్య సంస్కృతులు అనే అంశంపై ప్రముఖ సాహితీవేత్త మార్క్సిస్టు విమర్శకులు కల్లూరి భాస్కరం ప్రసంగించారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న భాష ఉద్యమం ద్రవిడ భాషల ఉనికిని నిలబెడుతుందని ఈ ఉద్యమం భాషలకు ప్రాణ ప్రతిష్ట చేసినట్లు అవుతుందని అన్నారు. అనంతరం జరిగిన రెండవ సెషన్ లో ఆధునిక ద్రావిడ భాషా సాహిత్య సంస్కృతులు అనే అంశంపై ప్రముఖ సామాజికవేత్త జి భార్గవ ప్రసంగించారు. శాంతి ప్రబోధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భార్గవ మాట్లాడుతూ దేశంలో ద్రావిడ భాషా యుద్ధం అనివార్యం అని అన్నారు. మార్క్సిస్ట్ అవగాహనతో నిర్దిష్టమైన శాస్త్రీయ పద్ధతిలో ద్రవిడ భాషల పై అవగాహన పరిశోధన నిరంతరం జరగాల్సిన అవసరం ఉందని ఈ తరహా భాష ఉద్యమాన్ని సాహితివేత్తలు భుజానికి ఎత్తుకొని భాషా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సభలో ప్రరవే నాయకులు డా. సుభాషిణి, డా. గంధం అరుణ, డాక్టర్ ఆదిలక్ష్మి, నిర్మలా రాణి, సుజాత, విరసం నాయకులు నాగేశ్వర చారి, పాణి, డిటిఎఫ్ నాయకులు కే రక్తం ఏసేపు, సుబ్బరాయుడు, కవులు ఎస్ డి వి అజీజ్, తెలుగు వెంకటేష్, రసూల్, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్, రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, ఆదోని డివిజన్ గౌరవాధ్యక్షులు ఎన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.