У нас вы можете посмотреть бесплатно తెల్లజొన్న రైతుకు మార్కెటింగ్ కష్టం || Sorghum prices falling below the MSP || Karshaka Mitra или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
తెల్లజొన్న రైతుకు మార్కెటింగ్ కష్టం || Sorghum prices falling below the MSP || Karshaka Mitra తెల్లజొన్న కొనుగోళ్లలో అధికారుల అలసత్వం || రైతులకు తప్పని మార్కెటింగ్ కష్టాలు. దేవుడు కరుణించినా పూజారి కనికరించలేదనే చందంగా తయారైంది జొన్న రైతుల పరిస్థితి. కృష్ణా జిల్లాలో జొన్న కొనుగోళ్ల కోసం రైతులు రోజులతరబడి రోడ్లపై పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెల్లజొన్నలో అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావటంతో మొక్కజొన్నకు ప్రత్యామ్నయాంగా రైతులు తెల్ల జొన్న సాగుకు మొగ్గుచూపుతున్నారు. మొక్కజొన్నతో పోలిస్తే జొన్నసాగులో రిస్కు తక్కువ వుండటం, శ్రమ, ఖర్చు గణనీయంగా తగ్గటంతో గత 4 సంవత్సరాలుగా జొన్నసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఆరుతడి పంటగా కేవలం రెండుమూడు నీటితడులతో పండే ఈ పంటలో రైతులు ఎకరాకు 20 నుండి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నారు. పంటకాలం 100 నుండి 110 రోజులు. 2020 – 21 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర హైబ్రిడ్ జొన్న రకాలు అయితే మద్ధతు ధర క్వింటాలుకు 2620 రూపాయిలు. సాధారణ జొన్న రకాలు అయితే క్వింటాకు 2640 రూపాయిలు కనీస మద్ధతు ధర వుంది. కానీ మార్కెట్ లో రైతుకు ఏనాడూ కనీస మద్ధతు ధర లభించలేదు. క్వింటాకు 1300 నుండి 1700 రూపాయలు మాత్రమే లభిస్తోంది. దీంతో గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల వద్ద నుండి జొన్న కొనుగోలుచేసే విధంగా చర్యలు చేపట్టింది. గత సంవత్సరం క్వింటాకు 2వేల 550 రూపాయిలు చెల్లించి రైతుల వద్ద నుండి కొనుగోలుచేసినప్పటికీ, మార్కెట్ ధర చాలా తక్కువ వుండటంతో ఈ ఏడాది పెరిగిన ధరకు భిన్నంగా క్వింటాకు 1850 రూపాయిలు చెల్లించే విధంగా కొనుగోళ్లకు ఆదేశాలు జారీచేసింది. అంటే క్వింటాపై ఏకంగా 750 రూపాయలకు పైగా తగ్గించింది. ఇది కూడా ప్రస్థుతం మార్కెట్లో దాళారులు కొనుగోలు చేసే ధర కంటే ఆశాజనకంగా వుండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే అమ్మేందుకు మొగ్గుచూపుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు రబీపంటగా జొన్నను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. మార్చి నెలలో పంట నూర్పిళ్లు పూర్తిచేసారు. అయితే 60 రోజులు గడిచినా రేపుమాపు అంటూ అధికారులు కాలం వెళ్లదీస్తుండటంతో రైతులు జొన్న అమ్మకాల కోసం రోజులతరబడి కళ్లాలవద్ద పడిగాపులు పడుతున్నారు. జొన్నలు కింద వేసే పట్టా అద్దె రోజుకు 150 రూపాయిలు. 60 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవటంతో ఒక్క పట్టాల అద్దెకే 10వేల రూపాయిలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు 30వేలు ఖర్చు పెట్టిన రైతుకు ప్రస్థుతం ప్రభుత్వం అందిస్తున్న మద్ధతు ధర గిట్టుబాటుగా లేదు. కనీసం ఈ ధరైనా లభిస్తుందనుకుంటే అధికారుల అలసత్వంతో కొనుగోళ్ల కోసం రైతులు రోజులు తరబడి కళ్లాలపై ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. #karshakamitra #jowarmarketprice #sorghumcultivation Facebook : https://mtouch.facebook.com/maganti.v...