У нас вы можете посмотреть бесплатно How SC Ezavas became the ruling caste-ఎస్సీ ఎజవాలు పాలక కులంగా ఎలా మారారు SSD или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
☸️☸️☸️☸️☸️ ఒకప్పటి అంటరాని కులాలు, పాలక కులాలుగా ఎలా మారగలిగినాయి- సమతా సైనిక్ దళ్ ☸️☸️☸️☸️☸️ 1901 జనాభా లెక్కలలో ఈ దేశంలోని మెజారిటీ బీసీ కులాలు అంటరాని కులాలుగానే నమోదు చేయబడినవి. మెజార్టీ శూద్రులు ఇప్పుడు అంగీకరించక పోవచ్చుగాని, కేరళలో 25% జనాభా కలిగిన ఎజెవా (కల్లుగీత) కులం వారు అంటరానికులం గానే నమోదు చేయబడ్డారు. మద్రాస్ ఆంధ్ర రాష్ట్రంలో 20% జనాభా కలిగిన కాపు (బలిజ) కులం అంటరాని లిస్టులోనే నమోదు చేయబడింది. వ్యభిచార వృత్తి కలిగిన కులాలు, అక్షరాస్యత అతి తక్కువగా ఉన్న కులాలన్నిటిని అంటరాని కులాల లిస్టులోనే చేర్చడం జరిగింది.1931 జనాభా లెక్కలలో అంటరాని కులాల లిస్టులో ఉన్న చాలా కులాలు అక్షరాస్యత అత్యధికంగా సాధించడం చేత, సాంఘీక హొదా పెరగటం చేత బీసీ లిస్ట్ లో చేర్చడం జరిగింది. అంటరానితనం కారణంగా, అక్షరాస్యత సాధించని కారణంగా, సాంఘీక హోదా పెరగని కారణంగా అప్పటికి, ఇప్పటికీ చాలా కులాలు ఎస్సీ,ఎస్టీ లిస్టులోనే ఉన్నవి. మా ఎస్సీ, ఎస్టీ స్టేటస్ పోతే మా బ్రతుకేంది అనే కులాలు కూడ ఉండవచ్చు. ☸️☸️☸️☸️☸️ సామాజిక తత్వవేత్త, మహోపాధ్యాయుడు, కవి, రచయిత, విప్లవకారుడు, విశ్వగురు శ్రీ నారాయణ గురు (1856-1928) తన సామాజిక మార్పు ఆలోచనలకు అవర్ణలను సమీకరించారు. హిందూ కులమతోన్మాద సంప్రదాయాలతో రాజ్యమేలుతున్న సమాజంలో ఒక అవర్ణుడు, అంటరానివాడు, సంప్రదాయాలనూ, నియమ నిబంధనలనూ బేఖాతరు చేస్తూ 1888లో శివరాత్రి నాడు ఉదయం తిరువనంతపురంనకు దక్షిణాన 40కి.మీ దూరంలో నయ్యార్ నది ఒడ్డున అరివిప్పరం అను గ్రామంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించారు. ఆనాటి ఈ కార్యక్రమంలో అవర్ణాలు వేలాది మంది పాల్గొన్నారు. బ్రాహ్మణ పూజార్ల వ్యవస్థకు ఆ శివలింగ ప్రతిష్టాపన ఒక బహిరంగ సవాలును విసిరారు. బ్రాహ్మణ పూజారులు ఈ దుస్సాహసాన్ని జీర్ణించు కోలేకపోయారు. ఆవర్ణునికి శివలింగ దేవుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించే హక్కును ఎవరిచ్చారని నిలదీశారు, బ్రాహ్మణ పండితులు. దీనికి ప్రతిగా శ్రీ నారాయణ గురు జవాబిస్తూ ఈ విగ్రహం మీ బ్రాహ్మణ శివుడిది కాదు, మా అవర్డుల అంటరాని వారికి చెందిన, ఈళవ శివుడిదని చెప్పారు. ఈ వార్త కేరళ వ్యాప్తంగా మారు మ్రోగింది. సమతా విప్లవ శంకారావాన్ని పూరించి ఆలయాన్ని తాన ఆశయానికి ఒక పనిముట్టుగా ఉపయోగించారు. ☸️☸️☸️☸️☸️ మానవులంతా సమానులేనని అరివిప్పరం దేవాలయ ప్రవేశద్వారం వద్ద "ఇక్కడ ఎటువంటి కులపరమైన వివక్షత, మతపరమైన శతృత్వాలు జాతి బేధం, మతద్వేషం లేకుండా మనుషులంతా కలిసిమెలిసి ఉండే ఆదర్శ నిలయం అని ఒక బోర్డు వ్రాసి పెట్టించారు. అనతి కాలంలోనే ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి కెక్కింది. ఇంతకాలం అసమానతలకు, వివక్షతకు గురైనటువంటి అవర్ణులను సంఘటిత పరిచేందుకు అనేక కార్యక్రమాలను, కార్యాచరణను రూపొందించారు. ఆ దిశగా అరిప్పిరం క్షేత్ర సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయం అనుబంధంగా ఒక గురుకులంను, సంస్కృత పాఠశాలను కూడా నెలకొల్పి అవర్థులకు మతపరమైన, భౌతికపరమైన విద్య శిక్షణ, ధర్మాశాస్త్రాలను బోధించేవారు. శ్రీ నారాయణ గురు వ్రాసిన జాత మీమాంస రచనలో "మనుషులందరిదీ ఒకే జాతి. ఒకే గర్భం, ఒకే శరీరం బేధమన్నది పూజ్యం" అని పేర్కొన్నారు. అలాగే ఏ జాతి ప్రాణులు ఆ జాతి ప్రాణుల్నే ఉత్పత్తి చేస్తాయి, కాబట్టి మనుషులంతా ఒకే జాతికి చెందినవాళ్ళు అని తన జాతి లక్షణంలో చెప్పారు. ☸️☸️☸️☸️☸️ శ్రీ నారాయణ గురు కేరళలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక మరియు శ్రీలంక దేశంలోనూ మొత్తం 60 దేవాలయాలను నిర్మించారు. బ్రాహ్మణేతరులకు శిక్షణ ఇచ్చి అర్చకులుగా నియమించారు. ప్రతి దేవాలయంలోనూ ఆయన పలు సందేశాలను ఇచ్చారు. పలునినాదాలు అక్కడ ప్రదర్శించబడి ఉండేవి. అవి "మనుషులందరికీ ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేవుడు" “కులం అడగవద్దు, కులం చెప్పవద్దు, కులం గురించి ఆలోచించవద్దు" "మతం ఏదైనా కానీ మనిషిని ఎదగనివ్వాలి" భారతదేశంలోని కేరళలో ఎజెవా (కల్లుగీత) ఒక సామాజిక కులం, రాష్ట్ర జనాభాలో దాదాపు 25% మంది ఉన్నారు. కేరళలోని కల్లుగీతవారు అంటరాని కులాల లిస్టులో చేర్చడాన్ని ఆంధ్రప్రదేశ్లోని కల్లు గీసే గౌడులు, శెట్టి బలిజలు,ఈడిగా ఒప్పుకో లేకపోవచ్చు. శ్రీ నారాయణ గురు ఆనాడే వితంతు స్త్రీలను అర్చకులుగా నియమించి సరికొత్త విప్లవానికి నాంది పలికారు. కులాంతర, మతాంతర వివాహలను, సహ పంక్తి భోజనాలను గట్టిగా సమర్థించారు. పూజా విధానంలో, దుస్తులు ధరించడంలో, ఆహారపు అలవాట్లలో మాట్లాడే భాషలో తేడాలు ఉండవచ్చును కానీ మనుషులందరూ ఒకే జాతికి చెందినవారు కాబట్టి కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం వలన, సహపంక్తి భోజనాలు చేయడం వలన ఎలాంటి హాని ఉండదు. అన్నారు. ప్రతి దేవాలయానికి అనుబంధంగా ఒక ప్రజాసంఘాన్ని, విద్యాలయాన్ని ఏర్పాటు చేసి దాని కార్యాక్రమాల నిర్వహణ బాధ్యతలను ఆ కమిటీకే అప్పగించేవారు. శ్రీ నారాయణ కలవంకోడం దేవాలయంలో ఒక అద్దాన్ని ప్రతిష్టించారు. "దేవుడు నీలోనే ఉన్నాడు, నీవే దేవుడవు" అని చెప్పారు. ☸️☸️☸️☸️☸️ ☸️☸️☸️☸️☸️ మూడు దశాబ్ధాలపాటు సాగిన ఈ ఆలయాల నిర్మాణ ఉద్యమంను జనం కోసం, వారి కోరిక మేరకు మాత్రమే చేశారు. ఆ తర్వాత ఆయన దృక్పధంలో మార్పు వచ్చింది. దేవాలయాలు ప్రతిష్టాపన కార్యక్రమానికి స్వస్తి పలికి విద్య పట్ల దృష్టిని కేంద్రీకరించారు. ప్రజల్లో తాము తీసుకువచ్చిన చైతన్యం ఇక చాలునని భావించి ప్రజల యొక్క విద్య, ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు, సాంఘిక దురాచారాలను నిర్మూలించడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇప్పటి నుండి దేవాలయాల నిర్మాణాలను మనం ప్రోత్సాహించకూడదు. ఇప్పటికే దేవాలయాల పట్ల ప్రజా విశ్వాసం సడలిపోతోంది. దేవాలయాల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ధనాన్ని వృధా చేయడం ఇప్పుడు విచారించదగిన విషయం కాలం ఎంతో మారిపోయింది. అయినా దేవాలయాల అవసరం లేదంటే ప్రజలంతా అంగీకరించక పోవచ్చును. ఎవరైనా తప్పనిసరి అని భావిస్తే చిన్నపాటి దేవాలయాలను నిర్మించుకోనివ్వండి. కాని మన దృష్టిలో "ఒక విద్యాలయమే అసలైన దేవాలయం' ఆరోజులలో కుల బేధం నిమిత్తం లేకుండా ప్రజలు ఒక చోట చేరి సమిష్టిగా పూజలు నిర్వహించేందుకు దేవాలయం అవసరమని భావించాం. .