У нас вы можете посмотреть бесплатно రాజమహేంద్రవరంలో "గోదావరి పుష్కరాలు" ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన* или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
పత్రిక ప్రకటన రాజమహేంద్రవరం, తేది:11.2.2026 2027 గోదావరి పుష్కరాలు: ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన పుష్కర యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రూట్ మ్యాప్ – షటిల్ బస్సుల ప్రణాళిక మహాశివరాత్రి ఏర్పాట్లపై దిశానిర్దేశం – అన్నప్రసాదాల పంపిణీ క్రమబద్ధీకరణకు ఆదేశాలు అత్యవసర సేవలకు ప్రత్యేక కారిడార్ – భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ సూచనలు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలోకి వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్ర స్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, కార్లు, ఆటోరిక్షాలు, మోటార్ సైకిళ్లు తదితర వాహనాలకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో సమాలోచన చేశారు. ప్రధాన కూడళ్ల సమీపంలో విస్తృత పార్కింగ్ స్థలాలు గుర్తించి, అక్కడి నుండి వివిధ ఘాట్లకు పుష్కర యాత్రికులను ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా తరలించి, తిరిగి అదే మార్గంలో చేరవేసే విధంగా ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రావులపాలెం, కాకినాడ వయా అనపర్తి కెనాల్ రోడ్డు మార్గం ద్వారా వచ్చే వేమగిరి సెంటర్ నుంచి ధవళేశ్వరం కాటన్పేట, బొమ్మూరు సెంటర్, వేమగిరి, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రూట్లను పరిశీలించారు. అలాగే వేమగిరి సెంటర్, ధవళేశ్వరం, బొమ్మూరు, మోరంపూడి, ఆర్టీసీ కాంప్లెక్స్, తూర్పు రైల్వే స్టేషన్ మార్గం, లాలాచెరువు, కాతేరు మీదుగా కోటిలింగాల రేవు వరకు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ మళ్లింపు, స్థానికుల వాహనాలకు ప్రత్యేక అనుమతుల జారీ వంటి అంశాలపై సమీక్షించారు. గత అనుభవాల దృష్ట్యా సమన్వయం లోపిస్తే అత్యవసర సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పేర్కొని, ముందస్తు ప్రణాళికతో ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా ఘాట్ల వద్ద, దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ముఖ్యంగా అన్నప్రసాదాల పంపిణీ క్రమబద్ధంగా జరిగేలా సంబంధిత శాఖలు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, అత్యవసర వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. పుష్కరాలు, శివరాత్రి వేడుకలు విజయవంతం కావాలంటే ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రధాన కూడళ్ల వద్ద అదనపు పోలీసు బలగాలు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించి వాహనాల రాకపోకలను దశల వారీగా మళ్లించే ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎస్డీసీ ఇంచార్జి ఆర్డీవో కె భాస్కర్ రెడ్డి, ఆర్ ఎమ్ సి ఇంజనీరింగ్ అధికారులు, రూరల్ తహసిల్దార్ శ్రీనివాస్, , ఎంపిడివో ఆర్మ్ స్ట్రాంగ్, , సి ఐ కాశి విశ్వనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు పాల్గొన్నారు. ------------ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి / ఆర్ ఎమ్ సి పీఆర్వో రాజమహేంద్రవరం వారిచే జారీ.