У нас вы можете посмотреть бесплатно Bhetala Katha/నవ్విన దొంగ/Story (కల్పితం) Writer (సాదనాల చంటిబాబు రచన ఆధారంగా) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
నవ్విన దొంగ navvina donga పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు, "రాజా, నువు ఏ స్నేహి తుడి కొరకైనా ఇలా శ్రమపడుతున్న పక్షంలో స్నేహితులను గుడ్డిగా నమ్మకు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆప్తమిత్రులే ద్రోహులవుతారు. స్నేహభావంతో చెడిపోయిన తారానాథుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను." అంటూ ఇలా చెప్పసాగాడు: ఒక కుగ్రామంలో తారానాథుడూ, సోమ నాథుడూ అని ఇద్దరు ఆప్తమిత్రులుండే వారు. వాళ్ళు ధనార్జన చేయదలచి, తమ గ్రామం విడిచి పెట్టి, దూరదేశాలకు వెళ్ళి వర్తకం చేసి మంచి లాభాలు గడించారు. ఆ లాభాలను ఇద్దరూ సమంగా పంచుకుని, తమ తమ ఇళ్ళలో స్థిరపడ్డారు. ధనం సంపాదించుకుని తిరిగి వచ్చేసరికి అతను నా ఇల్లు ఆక్రమించుకున్నాడు: బాల్యస్నేహితుడు గదా అని మంచిగా నా యిల్లు ఖాళీ చేసి ఇయ్యమంటే నన్ను పట్టుకుని చావగొట్టాడు. తమరు నా దుస్థితి గమనించి నాకు న్యాయం జరిగేటట్టు అను గ్రహించాలి," అన్నాడు. రాజు తన భటులను గ్రామానికి పంపి తారానాథు రప్పించాడు. సోమ నాథుడు కిందటి రాత్రి కొట్టిన దెబ్బ లతో సగం చచ్చి ఉన్న తారానాథుడు భటుల సహాయంతో రాజుగారి కెదురుగా నిలబడ్డాడు. "నువు ఉంటున్న ఇల్లు సోమ నాథుడిదిట. ఆ మాట నిజమేనా ? " అని రాజు తారానాథుణ్ణి అడిగాడు. తారానాథుడు సోమనాథుడి కేసి చూసి, సంగతి గ్రహించి, "నిజమే, మహారాజా ! ఆ ఇల్లు సోమనాథుడిదే!" అన్నాడు. "ఆ ఇల్లు ఖాళీ చెయ్యమంటే, నువు సోమనాథుణ్ణి కొట్టినమాట నిజమేనా?" అని రాజు మళ్ళీ అడిగాడు. తన మీద ఇలాటి ఫిర్యాదు చేసిన సోమ నాథుడి మనస్థితికి జాలిపడి తారానాథుడు, " నిజమే, మహారాజా!" అని తలవంచు కున్నాడు. సోమనాథుడు స్నేహభావమనేది ఎలా ఉంటుందో పూర్తిగా మరిచిపోయి ఉండటం చేత, తారానాథుడు తను కొట్టిన దెబ్బలతో మతిచెడి అలా జవాబులు చెబుతున్నా డనుకున్నాడు. రాజు తారానాథుణ్ణి దోషిగా నిర్ణయించి అతనికి కారాగార శిక్ష విధించాడు. భటులు అతన్ని తీసుకు పోయారు. ఈ తీర్పు వినగానే, విచారణ నిమిత్తం తీసుకురాబడిన దొంగ ఒకడు సభ అంతా మారు మోగేటట్టు గట్టిగా నవ్వాడు. సభ ముగియగానే రాజుగారు దొంగను తన వద్దకు పిలిపించి, " ఎందు కలానవ్వావు?" అని అడిగాడు. దొంగ ఆయనకు తాను నవ్విన కారణం చెప్పాడు. రాజు వెంటనే సోమనాథుడి వద్దకు ఒక మనిషిని పంపించి, "ఇవాళ తమరు రాజుగారి ఇంట అతిథిగా ఉంటున్నారు!' అని చెప్పి తన వెంట రాజభవనానికి తీసుకుపోయాడు. రాజుగారు తనకు అనుకూలంగా తీరు ఇవ్వటమేగాక, తన మీద ఆదరం కూడా చూపుతున్నందుకూ, తన ఎత్తు సులువుగా పారినందుకూ సోమనాథుడు అమిత ఆనందం పొందాడు. అతనికి రాజభవనంలో ఒక మంచి గదిలో బస ఏర్పాటు చేశారు. అక్కడా అతనికి భోజనమూ, తాగుడూ సమకూర-బడింది. అతను సుఖంగా తిని, తాగి, చల్ల గాలి కోసం కిటికీ తెరిచి చూసేసరికి, అవత గదిలో సంకెళ్ళు వేసిన తారానాథుడు కనిపించాడు. సోమనాథుడు అతన్ని పిలిచి, "ఎలాగూ నీ జీవితం ఖైదులో వెళ్ళిపోవలిసిందే. నువు నీ డబ్బు ఎక్కడ దాచావో చెప్పు?" అని అడిగాడు. తారానాథుడు అతని వంక జాలిగా చూసి, "నా ఇంటి తూర్పు గదిలో నా ధనమంతా రహస్యంగా దాచాను. అది తీసుకుని, ఇక నైనా దురలవాట్లు మాని సుఖంగా జీవించు," అన్నాడు, మరుక్షణమే సోమనాథుడున్న గదిలోకి ఇద్దరు భటులు వచ్చి, అతన్ని పట్టుకు తీసుకుపోయారు. మర్నాడు సభలో రాజుగారు సోమనాథు డికి యావజ్జీవ కారాగారశిక్ష విధించాడు. తారానాథుడి శిక్ష అలాగే ఉండిపోయింది. బేతాళుడి కథ చెప్పి, "రాజా. దొంగ ఎందుకు నవ్వాడు? అతను రాజుకు రహస్యంగా ఏం చెప్పి ఉంటాడు? సోమ నాథుడే దోషి అనీ, తారానాథుడు నిర్దోషి అని తేలిపోయాక రాజు సోమనాథుణ్ణి శిక్షించటం భావ్యంగానే ఉన్నది గాని, తారా నాథుడి శిక్ష ఎందుకు రద్దు చెయ్యలేదు? ఈ అనుమానాలకు తెలిసి కూడా సమా ధానం చెప్పకపోయావో నీ తల పగిలిపో తుంది.'' అన్నాడు. దానికి విక్రమార్కుడు, "చచ్చేటట్టు దెబ్బలు తిన్నట్టు కనిపిస్తున్న తారానాథుడు తాను సోమనాథుణ్ణి కొట్టావంటే రాజు నమ్మి తీర్పు చెప్పినందుకు దొంగ నవ్వాడు. ఆ దొంగ రాజుతో తారానాథుడి జవాబులు నమ్మతగినవికావనీ, అసలు సంగతి మరో విధంగా విచారించమని చెప్పి ఉంటాడు. అందుకే రాజు నిజం తెలుసుకోవటానికి సోమనాథుడికి అతిథ్య మిచ్చాడు. సోమ నాథుడితో బాటు రాజు తారానాథుణ్ణి కూడా ఎందుకు శిక్షించాడంటే ఇద్దరూ అన్యాయం కొనసాగటానికి సమంగానే పని చేశారు. సోమనాథుడి నేరం సఫలం కావటానికి తారా నాథుడు చేతనయినదంతా చేశాడు. అందు చేత అతను శిక్షార్హుడు." అన్నాడు. రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. Story (కల్పితం) Writer (సాదనాల చంటిబాబు రచన ఆధారంగా)