У нас вы можете посмотреть бесплатно Best Social Service Award at 77th Republic day 🇮🇳 Celebrations Rajamahendravaram 26-01-2026 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన సమరయోధుల త్యాగాల వల్లే నేడు మనకు స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య పాలన లభించిందని, వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల వారసులైన మారి రామతులసి, నెక్కింటి ఆదినారాయణ, ఎ. కృష్ణ వర్మ, క్రొవ్విడి భాస్కరరావు, కందుల బాబు రాయుడు తదితరులను కలెక్టర్ గారు శాలువాతో మర్యాదపూర్వకంగా సన్మానించారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రుడ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోలీసు, ఎన్సీసీ బృందాల కవాతు దేశభక్తిని చాటిచెప్పింది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 2025-26 సంవత్సరములో చేసిన విశిష్ట సేవలకు వై.మేఘ స్వరూప్ గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, తూ.గో.జిల్లా, ఐ.ఎ.ఎస్ వారి చేతుల మీదుగా పలువురికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ సామాజిక సేవా కార్యకర్తగా ప్రశంస పత్రం అవార్డు అందుకున్న సలాది ఉదయ భాస్కరరావు.తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన సలాది ఉదయభాస్కరరావు గత దశాబ్దన్నర కాలం నుండి పెరవలి మండలం లయన్స్ క్లబ్ ద్వారా ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు వశిష్ట వినియోగదారుల సంఘం కన్వీనర్ గా అనేక అవగాహన కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల ఆయన నిబద్ధతను సేవాభావాన్ని కృషిని గుర్తించిన పెరవలి తహసిల్దార్ కే నిరంజన్ సామాజిక కార్యకర్తగా సలాది ఉదయభాస్కరరావు యొక్క పనితీరును ఫోటోలు పేపర్ క్లిప్పింగులు తో కూడిన నివేదికను కొవ్వూరు ఆర్డీవో దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఈ విషయాలపై పరిశీలన చేసిన కొవ్వూరు ఆర్డిఓ రాణి సుష్మిత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు ఈ నివేదికను పంపి ఉత్తమ సామాజిక కార్యకర్తగా సనాది ఉదయభాస్కరరావుకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు ఇవ్వవలసిందిగా కోరారు. ఈ నివేదికను పరిశీలించిన ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ మెఘా స్వరూప్ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిభావంతులకు అందించే అవార్డులలో సలాది ఉదయభాస్కరరావుకు కూడా స్థానం కల్పించారు. దీంతో జనవరి 26వ తేదీ సోమవారం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో సలాది ఉదయభాస్కరరావు కు ఉత్తమ సామాజిక కార్యకర్తగా ప్రశంసా పత్రం అందించి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సలాది ఉదయభాస్కర మాట్లాడుతూ తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన అధికారులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవార్డు తనకు లభించడం పట్ల తనకు మరింత బాధ్యత పెరిగిందని పేర్కొంటూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సూపర్ ఇండెంట్ ఆఫ్ పోలీస్ కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత