У нас вы можете посмотреть бесплатно Sampoorna Sri Ramayanam - 2025 | Day 25 | Brahmasri Chaganti Koteswara Rao garu или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు గారిచే "సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనములు" - 2025 l ఇరవై ఐదవ రోజు (18-02-2025) కిష్కింధకాండ - నాల్గవ రోజు ప్రవచనము ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారం చేయనివాడు మహాపాపాత్ముడని, అతడి ముఖమైన చూడరాదని శ్రీ రామాయణము మనకు నేర్పిస్తుందని పూజ్య గురుదేవులు, "వాచస్పతి" బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచించారు. విశాఖపట్నంలో జరుగుతున్న సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనములలో భాగముగా కిష్కింధకాండ పై ప్రవచనములు కొనసాగుతున్నవి. వర్షాకాలము దాటి శరత్కాలము ప్రారంభమైనప్పటికీ భోగములను అనుభవిస్తూ సీతాన్వేషణను మరిచిపోయిన సుగ్రీవునిపై కినుక వహించిన శ్రీరాముడు లక్ష్మణుని సుగ్రీవుని వద్దకు వెళ్లి, వాలి వెళ్లిన మార్గము ఇంకా మూసుకుపోలేదని, ఉపకారమును పొంది ప్రత్యుపకారము చేయకపోవడం మహాపాపమని గుర్తుచేయమని చెప్పుట, ఆగ్రహించిన లక్ష్మణుడు సుగ్రీవుని నిర్జించి అంగదునకు కిష్కింధ రాజ్యమును ఇచ్చి సీతాన్వేషణ చేయిద్దామని ప్రతిపాదించుట, అందుకు అంగీకరించక శ్రీరాముడు మిత్రుడైన సుగ్రీవునకు మంచి మాటలు చెప్పాలి తప్ప అట్లా ప్రవర్తించరాదని లక్ష్మణులతో చెప్పుట వంటి సంఘటనలపై ప్రవచనము సాగినది. మత్తులో ఉండి, తాను పిలిచినా బయటికి రాని సుగ్రీవుడిని తీసుకురమ్మని అంగదునికి లక్ష్మణుడు చెప్పగా అంగదుడు మరొక ఇద్దరు వానర పెద్దలతో కలిసి సుగ్రీవుని వద్దకు వెళ్ళి, తాను చేస్తున్న తప్పును చెప్పి, రామలక్ష్మణులు తమ పరాక్రమము తో తామే సీతాన్వేషణ చేయగలరని, కానీ వారి నుండి సహాయమునుంపొందిన తానుబతిరిగి సహాయము చెయ్యాలని, లక్ష్మణునితో మాట్లాడమని చెప్పగా, సుగ్రీవుడు భయపడి లక్ష్మణునితో మాట్లాడమని తారను పంపగా, తార లక్ష్మణుని లోపలకు పిలిచిందని, అంతఃపురంలో ఉన్న పరిస్థితులను చూసి కొంత బిడియపడిన లక్ష్మణుడు అక్కడే వేచి ఉన్నాడని, తార లక్ష్మణులతో ఎంతో అద్భుతంగా మాట్లాడిందని శ్రీ గురువుగారు తెలియజేశారు. వానర జాతికి చెందిన చంచల మనస్కుడైన సుగ్రీవుడు ఎన్నో సంవత్సరముల తరువాత రాజ్య భోగమును అనుభవిస్తున్నాడని, అందుచేత కొంత విస్మృతిని పొంది చేయవలసిన కార్యమును ఇంకా ప్రారంభించలేదని, అంతే తప్ప తాను రాముడు చేసిన ఉపకారము మరచిపోయిన వాడో, కృతఘ్నుడో కాదని, మంచి శీలము కలిగిన వాడేనని తార లక్ష్మణునికి వివరించిన పధ్ధతిని గూర్చి వారు ప్రవచించారు. ఆఖరకు విశ్వామిత్రుడు అంతటి వాడే ఒకానొకప్పుడు మోహమునకు వశపడి తాను చేయవలసిన తపస్సును విడిచిపెట్టాడని, చంచల మనస్కుడైన సుగ్రీవుడు అట్లా చేయటము మహాపరాధము కాదని, అతడిని క్షమించమని తార లక్ష్మణుని వేడుకోగా సుగ్రీవుడు కూడా తన తప్పు తెలుసుకుని, లక్ష్మణుని వద్దకు వచ్చి, ఇప్పటికే నీలుడిని పంపించి సైన్యమును సమీకరిస్తున్న విషయమును చెప్పి, వెంటనే శ్రీరాముడిని కలుసుకొని చేయవలసిన కార్యములు ప్రారంభిస్తామని చెప్పగా లక్ష్మణుడు సంతోషించి, సుగ్రీవుని ప్రశంసించి, శ్రీరాముని వద్దకు తీసుకువెళ్లిన సంఘటన వరకు ప్రవచనము సాగినది. #SriChagantiVaani #SriChagantiPravachanamulu #ChagantiKoteswaraRaoGaru #Ramayanam #sampoornaramayanam #SampoornaRamayanam #ChagantiRamayanam #ChagantiLatestPravachanamulu #Ramayanam2025 #sriguruvanichaganti #ChagantiKoteswaraRaoGaru #ChagantiPravachanam #GuruvaniChagantiKoteswaraRaoGaru #sreeguruvani #sriguruvaani #sriguruvani #chagantikoteswararaogaru #chaganti #chagantiramayanam #vizag #visakhapatnam #2025