У нас вы можете посмотреть бесплатно కాశీమజిలీ కథలు 63- 30వ మజిలీ - భూపాలదేవ చక్రవర్తి కథ - నవ కుబేరుని కథ -Kasi Majili Kathalu - 63 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
అంతా మహావిచిత్రం- దైవాయత్తము- ఎవ్వరికెవ్వరూలేరు కథ ఆఖరి భాగము - Antha Maha Vichitram Katha Part 3 - 63 రోజు - Kasimajili kathalu క్రితం భాగంలో మనం ప్రత్యేక పరిస్థితుల్లో దైవాయత్తానికీ, రాకుమార్తె మాలతికి పెళ్ళి జరగడం, కానీ ఆ పెండ్లి కటికచీకటిలో జరిగినది కావడం వల్ల, ఆ అంతా విచిత్రం, దైవాయత్తం, ఎవ్వరికెవ్వరునూ లేరు అనే ఆ ముగ్గురిలో ఎవరు మాలతి భర్త అన్న విషయం మాలతికి గానీ, ఆమె తల్లిదండ్రులకు గానీ తెలియకపోవడం, వారి ముగ్గురిలో తన భర్త ఎవరో తెలుసుకోవడానికి, వారిని వెతుకుతూ విరాగిణిగా మాలతి దేశాటనానికి బయలుదేరడం వరకూ కథ చెప్పిన మణిసిద్ధుడు, అటుపై కోటప్పతో కలసి 30వ మజిలీకి చేరుకోవడం వరకూ కథను చెప్పుకున్నాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం. 30వ మజిలీకి చేరుకున్న పిదప, భోజనాది కార్యక్రమాలు అయిన తదుపరి, మణిసిద్ధుడు కోటప్పతో తరువాయి కథను ఇలా చెప్పసాగాడు. గోపా! అలా ఆ మాలతి, విరాగిణిగా మారి కాషాయంబరధారిణిగా అనేక పల్లెలూ పట్టణాలూ తిరుగుతూ ఆ ముగ్గురికోసం అన్వేషించసాగింది. అలా ఆమె ఒక అరణ్యంగుండా నడుస్తుండగా, బ్రాహ్మణుడొకడు ఆమెకు తారసపడ్డాడు. అతడిని ఆపి.. “ఆర్యా! వేదాంతులైన ముగ్గురు వ్యక్తులు పిచ్చివారిగా సంచారిస్తూ దేశాటనం చేస్తున్నారు. అటువంటివారిని మీరెక్కడన్నా చూశారా?” అని అడిగింది. దానికతగాడు.. “అమ్మా! ఇటుగా వెళితే ఒక పల్లె కనబడుతుంది. అక్కడ గ్రామస్థులు ముగ్గురు పిచ్చివాళ్ళను స్తంభాలకు కట్టేసి ఉంచారు. రాజద్రోహం నేరం కింద చెరసాలలో బంధింపబడిన వాళ్ళట ఆ ముగ్గురూ. వాళ్ళు తప్పించుకుని ఆ పల్లెవైపుగా వెళుతుంటే పట్టుకున్నారట. ఈ విషయం తెలియజేసి రాజభటుల్ని తీసుకురావడానికి, కొందరు సానుమంతనగరం వెళ్ళారు” అని చెప్పాడు. “అయ్యో భగవంతుడా! ఆ అమాయకులకు ఎంతటి దుఃస్థితి పట్టింది” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది ఆ మాలతి. అప్పుడా బ్రాహ్మణుడు “అదేమిటమ్మా అలా దుఃఖిస్తున్నావ్. వాళ్ళు నీకు తెలుసా” అని అడిగాడు. “నేను వారి శిష్యురాలినే ఆర్యా.” అంటూ, ఆమె గబగబా ఆ పల్లియవైపు నడవసాగింది. ఆమె అక్కడకు చేరుకునే సరికి రాత్రయ్యింది. అలా స్తంభాలకేసి కట్టబడి ఉన్న ఆ ముగ్గురినీ చూసి నిలువునా నీరైపోయింది మాలతి. వారికి కాస్త దూరంలో కాపలావాళ్ళు కూర్చుని ఉన్నారు. మాలతి ఆ ముగ్గురి దగ్గరకూ వెళ్ళి, వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ళు తాము ఎప్పుడూ వల్లించే మాటలను తప్ప వేరింకేమీ మాట్లాడటం లేదు. Rajan PTSK #RajanPTSK #KasiMajiliKathalu #TeluguStories #Ajagava