У нас вы можете посмотреть бесплатно బోయిన్ చెరువు చెరువును కప్పేసిన గుర్రపుడెక్క...విజృంభిస్తున్న దోమలు. పట్టించుకోని అధికారులు или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ఓల్డ్ బోయినపల్లి.. చెరవులో గుర్రపుడెక్క పెరిగి చెరువు మొత్తం విస్తరించింది. దీంతో ఒక వైపులు దోమలు, మరో వైపు దుర్వాసనతో సమీప ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు. హస్మత్పేట డివిజన్ బోయిన్ చెరువు సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా చెరువు అభివృద్ధి మాత్రం అంతంతే. బాక్స్ డ్రైనేజీ నిర్మాణం చేసినా ఎగువ ప్రాంతం నుంచి మురుగు నీరు చెరువులోకి వస్తోంది. దీంతో దుర్వాసన తప్పడం లేదు. హస్మతోపేట, ఓల్డ్ బోయినపల్లి డివిజన్లలో దోమల బెడదను ప్రజలు భరించలేని పరిస్థితి నెలకొంది. హస్మత్్పట, అంజయ్యనగర్, మల్లికార్జునగర్, సిండికేట్ బ్యాంక్ కాలనీ, బృందావన్ కాలనీ, హరిజన బస్తీ, మాలా బస్తీ, ఆర్ఆరనగర్, హెచ్ఎఎల్ కాల నీ, సమతానగర్, భవానీనగర్, ముస్లిం బస్తీ తదితర ప్రాంతాలలో దోమల దండయాత్ర చేస్తున్నాయి. దీంతో ప్రజలు రోగాల బారిన పడు తున్నారు. ఓల్డ్ బోయినపల్లి..హన్మత్పేట బోయిన్ చెరువు మొత్తం గుర్రపు డెక్క పరుచుకని దోమల వృద్ధితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే అదికారులతో చర్చించి పరిష్కారించేందుకు కృషి చేస్తామని బిజెపి సీనియర్ నాయకులు మరియు ఓల్డ్ బోయిన్పల్లి 119 DIV కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి యాదవ్ తెలిపారు. దోమల వల్ల అనారోగ్యం పాలవుతున్నారని చెరువులో గుర్రపు డెక్క తొలగించేలా చూడాలని ప్రజలు తన దృష్టికి తెచ్చారని దీని స్పందించి బుధవరం చెరువును బిజెపి సీనియర్ నాయకులతో కలసి సందర్శించడం జరిగిందని అన్నారు. చెరువు పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయిందని ఈ విషయంపై డిప్యూటి కమీషనర్ డాకు నాయక్ తో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా చెరువు కట్ట పూర్తిగా వాహనాలకు అక్రమ పార్కింగ్ గా మారిందని. గంజాయి బ్యాచ్లు సాయంత్రం అయిందంటే బతుకమ్మ కుంట చుట్టూ పక్కల, పార్కింగ్ మద్యలో తిష్ట వేసి గంజాయి సేవిస్తున్న విషయంపై ప్రజలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పోలీసులు హన్మత్ చెరువు కట్ట ప్రాంతంలో నిఘాను ఏర్పాటు చేసి పెట్రోలింగ్ చేపట్టాలని సూచించారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ దూరంగా ఉండటం పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయని అన్నారు. ఈ విషయంపై పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమ పార్కింగ్తో పాటు గంజాయి మూకలపై చర్యలు తీసుకోనేలా గట్టి నిఘా ఏర్పాటు చేసేలా కృషి చేస్తాననీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఫాగింగ్ జాడేలేదు.సర్కిల్ కార్యాలయాల విభజనలో భాగంగా ఏర్పడ్డ బోయినపల్లి సర్కిల్ కార్యాలయం పరిస్థితి దారు ణంగా తయారైంది. అసలు అధికారులు ఉన్నారా? అన్న చర్చ జరుగుతోంది. సర్కిల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జోనల్ కమిషనర్, సర్కిల్ డిపూటీ కమిషనర్, డీఈలు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ, ఇతర అధికారులు డివిజన్లలో పర్యటించలేదు. కేవలం సమావేశాలతో కాలం గడుపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంటమాలజీ సిబ్బందిని ఇతర సర్కిల్ కార్యాలయాలకు బదీలి చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. సిబ్బం ది లేక ఫాగింగ్ చేయకపోవడంతో ప్రజలకు ఇబ్బం దులు తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు గుర్రపుడెక్క తొలగించాలని, దోమల బెడద అధికంగా ఉంది హస్మత్పేట చెరువు అంతా మురికి మయంగా మారింది. దీంతో దుర్వా సన, దోమలతో ఇబ్బం దులు పడుతున్నాం. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. దోమల నివార ణకు యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు. వినతిపత్రాలు అందజేసినా ఫలితం శూన్యం. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు స్పందించాలి. అధికారులు చెరువులో పేరుకుపోయిన చెత్తా చెదారంతో పాటు గుర్రపు డెక్కను తొలగించాలి. యంత్రాంగం నిర్లక్ష్య వల్ల చెరువు మొత్తం గుర్రపుడెక్క విస్తరించింది. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి ఓల్డ్ బోయిన్పల్లి 119 DIV కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి యాదవ్ కోరారు. ఎంఎంసి పరిధిలో ఉన్న సర్కిళ్లలో చెత్త సమస్య కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు పర్యావేక్షించేందుకు న్యాక్ ఇంజనీర్లను నియమించిన పరిశుభ్రత మెరుగు పడటం లేదు. పారిశుద్ధ్యం సమస్యలపై ప్రజలు పిర్యాదు చెయ్యడం కోసం వాట్సాప్ నంబర్ 9063421300 నంబర్ను అందుబాటులోకి తెచ్చిన అదికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం. ఈ నంబర్ ద్వారా సమస్యలపై పిర్యాదు చేస్తే సత్వరమే పరిష్కారం చూపుతామని మల్కాజ్జిరి మున్సిపల్ కమీషనర్ వెల్లడించారు. దీనికి తోడు 14 మంది మాజీ సైనికులను పర్యవేక్షకులుగా నియమించారు. వారు రోజువారిగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆయా సర్కిళ్లలోని డివిజన్లలో పర్యటిస్తూ పారిశుద్ధ్యం పనితీరుకు సంబంధించిన నివేదికను ఇవ్వాలని చెప్పిన కమీషనర్ ఆదేశాలు ఎక్కడ అమలు కావడం లేదు