У нас вы можете посмотреть бесплатно Hrishi tv9 || నాదర్గుల్ లో రిజిస్ట్రేషన్ల నిలిపివేత పై కన్నెర్ర или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
నాదర్గుల్ లో రిజిస్ట్రేషన్ల నిలిపివేత పై కన్నెర్ర:: ముఖ్య మంత్రి మరియు మంత్రులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని పార్వతీపురం కాలనీవాసుల విన్నపం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల పరిధిలోని నాదర్గుల్ రెవెన్యూ లిమిట్స్ లో ఉన్న పార్వతి నగర్ కాలనీ పరిధిలో సర్వే నెంబర్లు 524, 525, 526, 527, 528, 529, 535, 536, 537, 538 లలో గల భూముల మరియు ప్లాట్ల లావాదేవీల రిజిస్ట్రేషన్ లను అకారణంగా నిలిపివేయడం ఫై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మారుతి నగర్ కాలనీలోని కనకదుర్గ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నిడమనూరి శ్రీను మరియు సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం, పార్వతీపురం కాలనీలో కొత్తగా సమస్యలు సృష్టించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉన్నప్పటికీ, అనేక రిజిస్ట్రేషన్లు వేలాదిగా కొన్ని దశాబ్దాలుగా అవుతున్నప్పటికీ, ఇప్పుడు 22 ఏ పేరిట రిజిస్ట్రేషన్ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందని వారు సూటిగా నిలదీస్తున్నారు. ఏ నిబంధన కింద రిజిస్ట్రేషన్ ఆపారని, దీనికి సంబంధించి జీవో కూడా రాలేదని, ప్రభుత్వాన్నించి ఉత్తర్వులు కూడా లేవని కూడా నిడమనూరి శీను తో పాటు ఉపాధ్యక్షుడు చంద్రయ్య మరియు కోశాధికారి శ్రీనివాసులు తదితరులు హృషి టీవీ9 తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. సడన్గా అసలు 22ఏ అనేది ఎందుకు తెరపైకి వచ్చిందని, దీని వెనక ఏమన్నా కుట్రకోన ఉందా అంటూ వారు నిలదీస్తున్నారు. 1983 సంవత్సరం నుంచి రిజిస్ట్రేషన్లు వరుసగా అవుతూనే ఉన్నాయని, ఇప్పుడు నిలిపివేయడం బాధాకరమని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు కలెక్టర్ నారాయణరెడ్డి లో చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేయాల్సిందిగా స్థానిక సబ్ రిజిస్టార్కు ఆదేశాలు ఇవ్వాలని కూడా వారు కోరారు.