У нас вы можете посмотреть бесплатно శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు || Mahashivratri celebrations in Adilabad или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Shivaratri #viralnews #Adilabad శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు || Mahashivratri celebrations in Adilabad #news #pjdigitalnews #devotion #lordshiva #mahashivaratri #telangana #adilabad #public #viralnews #bela #Kotilingalatemple #badhi #devotes మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు శైవ క్షేత్రాలతో పాటు పురాతన ఆలయాల్లో సైతం వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. అటు ఆదిలాబాద్ రూరల్ మండలం కుంభఝారి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో వెలసిన కోటిలింగాల దేవస్థానం వద్ద మహాశివరాత్రి వేడుకలు వేడుకగా సాగాయి. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు. మరోవైపు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బేల మండలంలోని బాది గ్రామంలో కొలువైన నందీశ్వర ఆలయం సైతం భక్తులతో కిట కిట లాడింది. ప్రతి ఏటా శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో జాతర వేడుకలను ఘనంగా జరపడం ఆనవాయితీగా వస్తోంది. వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన నందీశ్వర ఆలయం కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ముందుగా జుగ్నక్ వంశస్తుల ఆధ్వర్యంలో పూజాది క్రతువులను నిర్వహించారు. ఆంద్ర, మహారాష్ట్ర, చత్తిస్ ఘడ్ రాష్ట్రాల నుండి వారి వంశీకులు చేరుకొని ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకుని పూజల్లో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయిదు రోజుల పాటు జరగనున్న జాతర వేడుకల్లో భాగంగా అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఆలయంలో శివలింగంతో పాటు గణపతి, నాగేంద్రుని విగ్రహాలు దర్శనమిస్తాయి. ముఖద్వారం వద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. పరమ శివుడికి కోడె దూడలు, గంటలు, వెండి, బంగారం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఉపవాస దీక్షలు ఆచరించే భక్తుల కోసం సోమవారం మహాన్నదనం ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినాన వేలాది సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారని ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. ముఖ్యంగా జుగ్నక్ వంశస్థులు ఏ ప్రాంతంలో ఉన్నా... శివరాత్రి రోజున జరిగే పూజల్లో పాల్గొంటారని, అయిదు రోజుల పాటు ఇక్కడే ఉంటారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.