У нас вы можете посмотреть бесплатно Nara Lokesh Development Works In Mangalagiri అడుగడుగునా మహిళల మంగళహారతులతో లోకేష్ కి గ్రాండ్ వెల్కమ్ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#VarahiNews తాడేపల్లి రిటైనింగ్ వాల్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీల వరకు కృష్ణా నది కుడివైపు రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడను నిర్మించనున్నారు. తాడేపల్లి రిటైనింగ్ వాల్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన ఫొటోలు మంగళగిరి నులకపేటలో కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ.65 లక్షల సీఎస్ఆర్ నిధులు వెచ్చించి కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్ రూ.14.88 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ పూర్తి మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా పెదవడ్లపూడి గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 250 క్యూసెక్కుల నీటి విడుదల పరిమాణం కలిగిన ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. నీటిని ఎత్తిపోసేందుకు నాలుగు పంపులను అమర్చారు. ఎన్నికల సమయంలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను పూర్తిచేయించారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమూలిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్ మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రూ.22 లక్షల నిధులు వెచ్చించి లైబ్రరీ నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ముందుగా పెనుమూలి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం లైబ్రరీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. లైబ్రరీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. రూ.61 లక్షల నిధులు వెచ్చించి అన్న క్యాంటీన్ నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ముందుగా దుగ్గిరాల చేరుకున్న మంత్రి లోకేష్ కు టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి అన్న క్యాంటీన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్షయపాత్ర సిబ్బందితో కలిసి మంత్రి లోకేష్ సామాన్య ప్రజానీకానికి భోజనం వడ్డించారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమూలిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్ మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో రామాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన అనంతరం స్థానికంగా యాదవపాలెంలో ఉన్న శ్రీ కోదండ రామచంద్రస్వామి మందిరాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్ మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ముందుగా రేవేంద్రపాడు గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజానీకం ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.