У нас вы можете посмотреть бесплатно మార్కాపురం జిల్లాలో వాహనాలు దొంగలిస్తున్నా దొంగలు అరెస్ట్...//SBN NEWS// или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో మార్కాపురం జిల్లాలో వాహనాలను టార్గెట్ చేసుకొని చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను బేస్తవారిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా సమావేశంలో డీఎస్పీ నాగరాజు వెల్లడించిన వివరాల మేరకు కాకినాడ జిల్లాకు చెందిన గంగాధర్ రావు, కడప జిల్లాకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తులు కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారని కొన్ని నెలల క్రితం గిద్దలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా ఇంట్రా ఆటో ను దొంగలు చోరీ చేయడంతో పాటు బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాక్టర్ ను అపహరించారు. అంతే కాకుండా మరో 4 ఖరీదైన ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని 14 లక్షలు విలువచేసే చోరికి గురైన వాహనాలను రికవరీ చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు ఉన్నట్లుగా డీఎస్పీ తెలిపారు. దొంగలను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ అన్నారు. కేసును త్వరగా ఛేదించిన సీఐ రామకోటయ్య, ఎస్సై రవీంద్రారెడ్డి ను డీఎస్పీ అభినందించారు...