У нас вы можете посмотреть бесплатно ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ సాకార సొసైటీల సమావేశం ! или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
రాష్ట్రంలోని టైలర్స్ సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయాలని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ టైలర్స్ కో ఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున రావు అన్నారు. ఒంగోలులో రాష్ట్రవ్యాప్తంగా కో ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసిన చీఫ్ ప్రమోటర్లు, సభ్యులు ఒంగోలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో టైలర్స్ కో ఆపరేటివ్ సొసైటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సొసైటీల ఛైర్మన్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, టైలర్ల కష్టాలు, టైలర్స్ వ్యవస్ద మనుగడ కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ సహకారం వంటి పలు అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ టైలర్స్ కో ఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 90 శాతం మందికి పైగా టైలర్స్ కష్టాలు అనుభవిస్తున్నారన్నారు. ఓట్ల సమయంలో టైలర్స్ కు అవి చేస్తాం...ఇవి చేస్తాం అని చెప్పడమే తప్ప వాస్తంగా టైలర్స్ సంక్షేమానికి, వారి కష్టాలు తీర్చడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కూడా విద్యుత్ రాయితీ ఇవ్వాలని కోరారు. కనీసం 100 యూనిట్ల వరకు అయినా రాయితీ వర్తింప చేయాలన్నారు. టైలర్స్ కో ఆపరేటివ్ సొసైటీల ఛైర్మన్ల నియమకం చాలా నిరాశ కలిగిస్తోందన్నారు. ఛైర్మన్లు తమ స్వార్దం చూసుకుంటున్నారు తప్ప టైలర్స్ సంక్షేమం చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టైలర్స్ వ్యవస్దకు ఈ ప్రభుత్వం గుర్తింపు తెస్తుందన్న నమ్మకం ఉందన్నారు. టైలర్స్ కో ఆపరేటివ్ సొసైటీల సంక్షేమం కోసం జీఓలు మారుతున్నాయి తప్ప తమ జీవితాల్లో ఎటువంటి మార్పు రావడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా 50 సంవత్సరాలకు పింఛన్ సౌకర్యం కల్పిస్తే తమ టైలర్స్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్దులకు అందిస్తున్న కిట్లలో దుస్తులు ఉంచాలని కోరారు. టైలర్స్ నైపుణ్యాల పెంపుదల కోసం కనీసం జిల్లాకు ఒక శిక్షణ కేంద్రం అయినా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గార్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, టైలర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ చెల్లుబోయిన శ్రీనివాసరావు, సత్తెనపల్లి ప్రైమరి కోపరేటివ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ జవంగుల వెంకటసుబ్బారావు, పల్నాడు జిల్లా అచ్చంపేట సొసైటీ ప్రమోటర్ కొండలరావు, పొన్నూరు ప్రైమరీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ చీప్ ప్రమోటర్ అమీర్జాని, ఒంగోలు టైలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్.కె హుస్సేన్, జిల్లా కమిటీ సభ్యులు టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ మొగల్తూరు పడవల సత్యనారాయణ, టైలర్స్ కోపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్ను లక్ష్మీ పాల్గొన్నారు.