У нас вы можете посмотреть бесплатно ఉగ్ర స్తంభం | UGRA STAMBHAM | VIP VLOGS | PRIVATE CREATIONS или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#VIPVLOGS #MOBILEMOTOVLOGGING #P_C #Teluguvlogging 9:22 చరిత్ర : ఆంధ్ర ప్రదేశ్ లో సహజ శిల నిర్మాణాలు తిరుమల తో పాటు కర్నూల్ జిల్లా లో కూడా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పట్టణం సమీపం లో అహోబిలం గ్రామంలో శ్రీ నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు . ఈ గ్రామం నుంచి నల్లమల్ల అటవీ ప్రాంతం కొండల్లో ఈ స్వామి రూపాలే మరికొన్ని ఉన్నాయి , వీటినే భక్తులు నవ నరసింహాలుగా కొలుస్తారు . ఇక్కడ నుంచి పర్వతారోహణ మొదలవుతుంది , మొదటగా ఎగువ అహోబిలం ఉగ్ర రూపం లో ఉన్న స్వామిని దర్శించుకుంటారు . ఇక్కడకి సమీపంలో నవ నరసింహ దేవస్థానాలు ఉన్నాయి . జ్వాలా నరసింహ స్వామి దేవస్థానం సమీపంలో జలపాతాల తరువాత ఉగ్ర స్తంభం వెళ్ళడానికి పర్వతారోహణ ప్రారంభమవుతుంది. ఇది ప్రమాదకరమైన మార్గం, ఇది 80 డిగ్రీల నిటారుగా ఉంది. ఈ ఉగ్ర స్తంభం సహజ శిలా రూపంలో భక్తులని ఆకట్టుకుంటూ పర్వతారోహులకి అలసట దూరం చేస్తుంది . కథ: హిరణ్య కశిపుడు తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని చండామార్కులు ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి తోయించినా ప్రహ్లాదునకు బాధ కలగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్త్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఈ విషయాన్ని గురువులు రాజుతో మొరపెట్టుకున్నారు. ఆగ్రహం తో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - "నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు?" అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, "అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు" ప్రహ్లాదుడు. ఆ హరి ఎక్కడుంటాడు? అని హిరణ్య కశిపుడు ప్రశ్నించగా "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు" అని చెప్పాడు ప్రహ్లాదుడు ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు బ్రహ్మాండం బ్రద్దలయ్యేలా ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెరిగాయి శ్రీహరి నరసింహ రూపంలో స్తంభమునుండి ఆవిర్భవించాడు. వస్తూనే హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తన ఒడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి అంతమొనర్చాడు . ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నరసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంపై, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడలపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు. Telugu Vlogging ❤️❤️❤️ My Social media handles INSTAGRAM - / v_i_p__p_c FACEBOOK - / venkatpeesapati.pc TWITTER - / v_i_p__p_c STAY TUNED........ My Mobile https://www.amazon.in/Redmi-Pro-Black... Earphones Link AMAZON https://www.amazon.in/Mi-Earphones-Ba...