У нас вы можете посмотреть бесплатно The celebrations are beingheld with great pomp and show underthe leadership former MPP Devineni Raja или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
తమ గ్రామంలోని శ్రీపద్మావతి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రతిష్టించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారికి ఘనంగా మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించామని కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో ఆలయంలో ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు, అర్చనలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వామివారి కృపతో గ్రామం అభివృద్ధి చెందాలని, సమస్త మానవాళిపై శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలోని శ్రీపద్మావతి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రతిష్టించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవస్థాన కమిటీ గ్రామ ప్రజల సహకారంతో మాజీ ఎంపీపీ దేవినేని రాజా నేతృత్వంలో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా ప్రారంభమైన ఈ ధార్మిక కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ వేడుకలలో భాగంగా ఈరోజు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి మహా కుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయణం, కుంభారాధన, ఉక్తహోమాలు, మహాపూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, మహా కుంభాభిషేకం, కలశావాహనం, హారతి వంటి పలు విశిష్ట పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ దేవినేని రాజా మాట్లాడుతూ, గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రతిష్టించి 12 సంవత్సరాలు పూర్తవడం ఆనందకర విషయమన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఐదు రోజులపాటు విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలతోపాటు యావత్ ప్రజానీకంపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం పలువురు గ్రామ పెద్దలు, భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం, అభివృద్ధికి దేవినేని రాజా ఎనలేని కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు.