У нас вы можете посмотреть бесплатно సిరికాకొలను సిన్నది నృత్య రూపకం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
చరిత్రకు అద్దం పట్టిన సిరికాకొలను సిన్నది నృత్య నాటిక వర్ణ ఆర్ట్స్ అకాడమీ వారిచే సుప్రసిద్ధ నాట్యకారిణి స్మితా మాధవ్ ప్రధాన పాత్రలో అలరించిన నృత్య నాటిక శ్రీకాకుళం (ఘంటసాల): పరమాత్మ పట్ల భక్తిని కళాత్మక సౌందర్యాన్ని మాధుర్య భరితమైన భావాల మేళవింపుగా సిరికా కొలను సిన్నది నృత్య రూపకం అద్భుతంగా ఆకట్టుకుంది. వేటూరి సుందర రామమూర్తి రచించిన ఈ సిరికాకొలను సిన్నది నృత్య రూపకాన్ని శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానంలో హైదరాబాద్ వర్ణ ఆర్ట్స్ అకాడమీ వారిచే, సుప్రసిద్ధ నాట్యకారిణి స్మితా మాధవ్ ప్రధాన పాత్రలో ప్రదర్శించి ఆధ్యంతం కరతాళ ధ్యనులు అందుకున్నారు. జానపదం, చారిత్రకం, పౌరాణికాల సమాహారంగా ఈ ప్రదర్శన సాగింది. దేవాదాసీల భావోద్వేగాలకు అద్దం పట్టే ఈ నృత్య నాటిక ప్రేక్షకులను శ్రీకృష్ణ దేవరాయల వారి కాలానికి తీసుకువెళ్ళింది. శ్రీకృష్ణ దేవరాయలవారు శ్రీకాకుళం దేవస్థానంలో ఆముక్త మాల్యద గ్రంథ రచన చేసిన రోజుల్లో ఈ గ్రామంలో ఉన్న దేవదాసి కుటుంబంలో జన్మించిన అలివేణి అనే యువతి తాను దేవాదాసిగా మారేందుకు ఇష్టపడక, తాను శ్రీకృష్ణుడిని భర్తగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించి, శ్రీకృష్ణుని ప్రతిరూపమైన ఆంధ్ర మహా విష్ణువును స్తుతిస్తూ శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామికి సేవలు చేసుకుంటూ ఉంటుంది. ఆమెను కపట బుద్ది కలిగిన మండలాధీశుడు మార్తాండ శర్మ శ్రీకృష్ణునిలా వచ్చి మోసం చేసి గర్భవతిని చేస్తాడు. మార్తాండ శర్మను శిక్షించటంతో నృత్య రూపకం ముగుస్తుంది. వేటూరి సుందర రామమూర్తి సుసంపన్నమైన కలం ద్వారా రూపుదిద్దుకున్న ఈ అద్భుతమైన నృత్యకళారూపకాన్ని స్మితా మాధవ్ తన బృందంతో రసరమ్యంగా, ఆధ్యంతం ఆసక్తికరంగా ప్రదర్శించిన కళాకారులు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 1969లో వేటూరి సుందరరామమూర్తి రచించిన సిరికాకోలను సిన్నది నాటికను 1973లో ప్రఖ్యాత కళాకారులైన పెండ్యాల నాగేశ్వరరావు, వోలేటి వెంకటేశ్వరులు, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, బాలంత్రపు రాజినికాంతరావు, కందుకూరి చిరంజీవిరావు తదితరులు కలిసి రేడియో సంగీత నాటికగా మలిచారు. స్మితా మాధవ్ ఈ నాటిక గురించి తొలిసారి, స్వర్గీయ కళాతపస్వి కె.విశ్వనాధ్ ద్వారా తెలుసుకుని వేటూరితో స్నేహం, చిరకాల అద్వితీయ పరిచయంతో నృత్య నాటికగా మలిచి ప్రదర్శిస్తున్నారు. సంగీత సంపద, పదసౌందర్యంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధురాలను చేసిన ఈ నృత్య నాటిక ప్రదర్శన సంగీత మాధుర్యం, పాత్రల హృదయాల్లో దాగి ఉన్న సున్నితమైన భావోద్వేగాలు, వారి మధ్య నలిగే నైతిక సంక్లిష్టత ఆసక్తికరంగా ఉంటాయి. అలివేణి చెలికత్తెలు చంచల, జలజలుగా రాధిక, హంసిక, కుటిల రంగాజీగా భార్గవి, కపట మార్తాండ శర్మగా హరి, శ్రీకృష్ణ దేవరాయలుగా మెహెర్, కృష్ణుడుగా అదితి, అల్లసాని పెద్దన్న కవిగా శ్రేయ, గోపికలుగా ఇషి, విద్య, తుహిని, విట్టులుగా సాహితీ, సహన, విశాఖ, రాజిత, వైద్యునిగా హంసినీ, కృష్ణ పాత్రల్లో హర్షిత, అర్జున్, అభినవ్ నటించి మెప్పించారు. ప్రదర్శన అనంతరం జస్టిస్ యూవీ దుర్గాప్రసాద్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, సర్పంచ్ ముప్పనేని రవిప్రసాద్, ఎంపీటీసీ తాడికొండ వేంకటేశ్వరరావు ఘనంగా సత్కరించారు.