У нас вы можете посмотреть бесплатно బుద్ధభూమి తొలి అడుగు ఆయనదే | రేకా కృష్ణార్జునరావు గారి సేవలు | బౌద్ధ ధర్మ ప్రయాణం -సంపాదక వర్గం или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
పత్రిక మాట: బుద్ధభూమి తొలి అడుగు ఆయనదే..! బుద్ధభూమి పేరు వినగానే ఆయన పేరే తలంపుకు వస్తుంది. బౌద్ధ తాత్విక ఆలోచనల కార్యాచరణకు మంగళగిరిని ఒక కేంద్రంగా నిలిపిన వ్యక్తి. ఆయన ఒక సాదా సీదా మనిషి. అయితేనేం నిత్య సత్యాన్వేషి. బంధు మిత్రులతో ఆలోచనలు పంచుకుని, బౌద్ధం చదువుతూ, చదివిస్తూ "మంగళగిరి బుద్ధ విహార ట్రస్టు" స్థాపించిన వ్యక్తి.. ఆయన పేరే రేకా కృష్ణార్జునరావు. కాలక్రమంలో ఈ ట్రస్టుకి ఆయన ఛైర్మన్ గా, అన్నపరెడ్డివెంకటేశ్వర రెడ్డి గారు వైస్ చైర్మన్ గా పని చేసారు. ఈ నేపథ్యంలోనే- బౌద్ధ భావ జాలానికి ఒక పత్రిక ఏర్పాటు చేయాలనే తలంపుతో కృష్ణార్జున రావు గారు పెద్దలు అన్నపరెడ్డి బుద్ద ఘోషుడు, డి. చంద్రశేఖర్, గార్లతో మాట్లాడారు. వారి సూచనలతో 2011 జనవరిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బౌద్ద దమ్మ మిత్రులతో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని బోధి గారు ఏర్పాటు చేశారు. ఆ సమా వేశం నిర్ణయం మేరకు - రేకా కృష్ణార్జునరావు గారు పబ్లిషర్ గా 2011 మే నుండి సంఘమిత్ర ద్వి మాసపత్రికగా ఆరు సంచికలు వచ్చాయి. 2012 మే నుండి RNI వారు ఇచ్చిన టైటిల్ ప్రకారం బుద్ధభూమి మాస పత్రికగా ఆరంభమైంది. బుద్ధభూమి స్థాపనలో కృష్ణార్జున రావు గారు చూపిన పట్టుదల, చొరవలతోనే తొలి అడుగులు పడ్డాయి. అయితే పత్రికకు ఆర్థిక ఇబ్బందులు నీడలా వెంటాడుతూ వచ్చాయి. మంగళగిరి బుద్ధ విహార కార్యదర్శి పామర్తి రవి గారితో, విహార సభ్యులతో, అన్నపరెడ్డి బుద్ద ఘేషుడు గారితో మాట్లాడి బుద్ద విహారకు చెందిన ఎకౌంట్ నుంచి డెబ్బై వేల రూ.లు బుద్ధభూమికి విరాళంగా ఇచ్చారు. 2015 సంవత్సరం చివరి వరకు కృష్ణార్జునరావు గారే పత్రిక బాధ్యతలు చూశారు. తరువాత ఆరోగ్య పరిస్థితులు రీత్యా పత్రిక బాధ్యతలు బొర్రా గోవర్ధన్ గారికి అప్పచెప్పారు. ఆంజనేయరెడ్డి గారి సూచనలతో అమరావతి ధాన్యకటక బుద్ధ విహార ట్రస్టు అధ్యక్షులు డా. వావిలాల సుబ్బారావు గారు కొంతకాలం పత్రిక ఆర్థిక బాధ్యతలు చూశారు. ఆర్థిక పునాదులు బలoగా లేని చిన్న పత్రికల అవస్థ ఇది. పత్రికకు రిజిస్టర్డు సంస్థ ఒకటి ఉండాలని, అలాంటిది వుంటేనే దాతలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తారని సంపాదక వర్గం నిర్ణయం మేరకు - 2016 లో "బుద్ధభూమి విజ్ఞాన సమితి" సొసైటీ యాక్టు కింద రిజిస్టరు చేయించడం జరిగింది. దీనికి.ఆంజనేయరెడ్డి గారు అధ్యక్షులుగాను, కృష్ణార్జునరావు గారు ఉపాధ్యక్షులు గాను ఉన్నారు. 2017 లో సొసైటీ పేరు మీద జాయింట్ ఎకౌంట్ ను ఓపెన్ చేయడం..అదే నేటికీ కొన సాగుతుంది. ఏదైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తి పేరుతో కంటే సంస్థ కింద వుంటేనే సముచితoగా ఉంటుందనేది సత్యం. అలాంటి సంస్థ ఏర్పడింది కనుక 2017 లో కృష్ణార్జునరావు గారు బుద్ధభూమి విజ్ఞాన సమితి కి పత్రిక హక్కులు రాసిచ్చారు. అయితే అది RNI వారి నుండి ఆమోదం పొందవలసి ఉంది. నేటికీ.. కృష్ణార్జునరావు గారే పత్రికకు పబ్లిషర్ గా ఉన్నారు. ఇది గౌరవంతోనూ, ఇష్టoతోనూ త్రికరణశుద్ధిగా సాగిన ప్రయాణం. కృష్ణార్జునరావు గారు పత్రికకు ఆద్యులుగాను, కొంతకాలం బాధ్యులు గాను సాగారు. పత్రిక వ్యాసాల ఎడిటింగ్ లోనూ, రూపురేఖల విషయంలోనూ ఆయన చూపిన శ్రద్ధ, అంకితభావం మర్చిపోలేం. అలాగే శ్రీమతి సామ్రాజ్యం గారు బౌద్ధ ఉద్యమంలోనూ, పత్రిక విషయంలోనూ చాలా సహక రించారు. పలు ప్రాంతాల నుండి బౌద్ధ ప్రముఖులు మంగళగిరి వస్తే కృష్ణార్జునరావు గారి ఇల్లే ఆతిథ్యానికి కేంద్రంగా ఉండేది. ఆయనతో కలిసి అడుగులు వేసిన ఉత్తమ ఉపాసకురాలు రేకా సామ్రాజ్యం గారు. 2021 మార్చిలో బుద్ధభూమి100 వ సంచిక ఆమె చేతుల మీదగానే ఆవిష్కరణ జరిగింది. సత్య సమ్మతమైన బౌద్ధ ధమ్మాన్ని సర్వజన సమ్మతంగా వ్యాప్తి చేయడం బుద్ధభూమి లక్ష్యం. అదే మనందరి లక్ష్యం, గమ్యం. ఇది ఒక పవిత్రమైన, నీతివంతమైన తాత్విక ప్రయాణం. ఈ ప్రయాణంలో కృష్ణార్జునరావుగారి పాత్ర మరువలేనిది, మర్చిపోలేనిది. -సంపాదక వర్గం, -బుద్ధభూమి విజ్ఞాన సమితి. వీడియో made from notebooklm tools #Buddhabhumi #BuddhistMagazine #KrishnarjunaRao #BuddhistMovement #BuddhaTeachings #Mangalagiri #BuddhistCommunity #Dhamma