У нас вы можете посмотреть бесплатно 🟣 02 నవంబరు 2025- సకల మృతుల సంస్మరణ-All Souls’ Day или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
సకల మృతుల స్మరణ మొదటి పఠనము: సోలోమోను జ్ఞాన గ్రంథము 3:1-9 భక్తి కీర్తన: కీర్తన గ్రంథము 27:1, 4, 7, 8, 9, 13-14 రెండవ పఠనము: రోమీయులకు వ్రాసిన లేఖ 6:3-9 సువిశేష పఠనము: యోహాను సువార్త 6:37-40 మొదటి పఠనము సోలోమోను జ్ఞాన గ్రంథము 3:1-9 సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారేనాడును వ్యధలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించిరి. తమ మరణానంతరము అపజయము , పొందినవారివలెను నాశనమునకు గురి అయిన వారివలెను చూపట్టిరి. కాని వారు శాంతిని అనుభవించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారివలె చూపట్టినను అమరత్వము పొందెదమను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాల పెద్దది. " ప్రభువు వారిని పరీక్షించి చూచి, వారు తన సన్నిధిలో ఉండుటకు యోగ్యులని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహనబలి నంగీకరించినట్లుగా, వారి ప్రాణములనంగీకరించెను. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము ఈయవచ్చినపుడు వారు ఎండుగడ్డిని కాల్చు రవ్వలవలె మండుచూ దుష్టులను కాల్చివేయుదురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరతము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మినవారికి ఆయన సత్యము తెలియును. ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు. ఆయన తానెన్నుకొన్నవారికి కరుణను, వరప్రసాదమును దయచేయును. ప్రత్యుత్తర గీతం భక్తి కీర్తన: కీర్తన గ్రంథము 23:1-3, 3-4, 5, 6 అందరు: ప్రభువే నాకు కాపరి. ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి. ఇక ఏ కొదవయు లేదు. ఆయన నన్ను పచ్చికపట్టులలో విశ్రమింప చేయును. శాంతికరమైన జలముల యొద్దకు నన్నునడిపించుకొనిపోవును. నా ఆత్మను సేదదీర్చును. అందరు: ప్రభువే నాకు కాపరి. ఇక ఏ కొదవయు లేదు. తన నామ గౌరవవార్ధము నన్ను ధర్మమార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించునపుడును, నేనెట్టి అపాయమునకు భయ పడను. ఎందుకన, నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతికట్ట నన్ను కాపాడుచుండును. అందరు: ప్రభువే నాకు కాపరి. ఇక ఏ కొదవయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు. నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరు: ప్రభువే నాకు కాపరి. ఇక ఏ కొదవయు లేదు. నేను జీవించినన్నాళ్లు నీ కరుణయును, ఉపకారమును నా వెంట వచ్చును. నేను కల కాలము ప్రభు మందిరమున వసింతును. అందరు: ప్రభువే నాకు కాపరి. ఇక ఏ కొదవయు లేదు. రెండవ పఠనము పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖ 14:7-9 10-12 మనలో ఎవ్వుడును తనకొరకే జీవింపడు. ఎవ్వడును తనకొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను, మరణించినను మనము ప్రభువునకు చెందినవారమే. ఏలయన, జీవించియున్న వారిని, మరణించిన వారిని పాలించుటకే క్రీస్తు మరణించి. సజీవుడయ్యెను. కనుక మీరు మీ సోదరునిపై ఏల తీర్పు చెప్పుదురు? లేదా, మీరు మీ సోదరుని ఏల తృణీకరింతురు?. మనము అందరమును తీర్పు కొరకై దేవుని న్యాయపీఠము ఎదుట నిలువబడుదుము. ఏలయన, "నాతోడు, అందరును నా ఎదుట తప్పక మోకరింతురు. అందరును దేవుని స్తుతింతురు, అని ప్రభువు చెప్పుచున్నాడు" అని వ్రాయబడియున్నది. కదా! కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకోనవలసి యుండును. అల్లెలూయా వచనము అల్లెలూయా!అల్లెలూయా! దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను; ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్యజీవమును పొందుటకై అట్లు చేసెను, అల్లెలూయా! సువిశేష పఠనము మత్తయి సువార్త 11:25-30 నా తండ్రి నాకు ఒసగు ప్రతివాడు నా యొద్దకు వచ్చును. వానిని నేను ఎన్నడు త్రోసివేయను. ఏలన, నేను పరలోకము నుండి దిగివచ్చినది, నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటకే కాని, నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదీయు పోగొట్టుకొనక, అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును" అని సమాధాన మిచ్చెను.