У нас вы можете посмотреть бесплатно ⚪️ ఆదివారము, 9 నవంబరు 2025- లాటారను మహా ఆలయ ప్రతిష్ఠ - “నీ గృహము నందు నాకు గల ఆసక్తి నన్ను దహించును” или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
లాటారను మహా ఆలయ ప్రతిష్ఠ 32వ సామాన్య ఆదివారం మొదటి పఠనము: యెహేజ్కేలు 47:1-2,8-9,12 భక్తి కీర్తన: కీర్తనల గ్రంథము 84: 3-6, 10 రెండవ పఠనము: 1 కొరింతీయులు 3:9-11, 16-17 సువిశేష పఠనము: యోహాను సువార్త 2:13-22 మొదటి పఠనము దేవుని గుమ్మము క్రిందనుండి వచ్చు నీరు పారిన తావులందెల్ల జీవము నెలకొనెను యెహేజ్కేలు గ్రంథము 47:1-2,8-9,12 అతడు నన్ను దేవాలయ గుమ్మము నొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి, తూర్పు దిక్కుగా ప్రవహించు చుండెను. దేవాలయ మును అటు వైపునకే తిరిగియుండెను. ఆ జలము దేవళము దక్షిణదిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి, ఉత్తర భాగము గుండ వెలుపలికి కొనిపోయి, తూర్పునకు ఎదురుగా నున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసికొనిపోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్నకాలువ పారు చుండెను. అతడు నాతో ఇట్లనెను: "ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి, యోర్దాను లోయను చేరి అచటనుండి మృతసముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పనీళ్లు మంచి నీళ్లగును. ఈ నీళ్లు పారిన తావులందెల్ల వివిధ జంతువులు, చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృతసముద్రమును మంచి నీటిని చేయును. ఇది పారిన తావులందెల్ల జీవము నెలకొనును. ఆ ఏటి యొద్దులపై అన్నిరకముల పండ్లచెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు. అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును. కనుక, అవి ప్రతినెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారము నకును, ఆకులు మందునకును ఉపయోగపడును.” ప్రత్యుత్తర గీతం భక్తి కీర్తన: కీర్తనల గ్రంథము 84: 3-6, 10 అందరు: సర్వశక్తిగల సర్వేశ్వరా నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది. నా దేవుడవు, నా రాజువు, దళములకధిపతియైన ప్రభూ!నీ బలిపీఠము వద్ద పిచ్చుకలు గూడు కట్టుకొన్నవి. వానకోవెలలు కూడ పిల్లలు చేయుటకు గూడు పెట్టుకొన్నవి. అందరు: సర్వశక్తిగల సర్వేశ్వరా నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది. నీ మందిరమున వసించుచు, ఎల్ల వేళల నిన్ను స్తుతించువారు ధన్యులు. అందరు: సర్వశక్తిగల సర్వేశ్వరా నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది. నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయగోరువారు ధన్యులు. వారు ఎండిన లోయగుండ పయనము చేసి దానిని చెలమల తావుగా మార్చుదురు. తొలకరి వానలు దానిని మడుగులతో నింపును. అందరు: సర్వశక్తిగల సర్వేశ్వరా నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది. అన్యుల ఇండ్లలో వేయినాళ్లు గడపినదాని కంటె నీ మందిరమున ఒక్క రోజు వసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటె నా దేవుని మందిరమున ద్వారపాల కుడనుగా ఉండుట శ్రేష్టము. అందరు: సర్వశక్తిగల సర్వేశ్వరా నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది. రెండవ పఠనము మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసము. పునీత పౌలు గారు కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖ 3:9-11, 16-17 మేము దేవుని సేవలో కలిసి పని చేయువారము. మీరు దేవుని పొలము. మీరు దేవుని భవనము కూడ. దేవుడు నాకు ఒసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పివలె పని చేసి పునాదిని వేసితిని. వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కాని తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగ ఉండవలెను. ఏలన, యేసు క్రీస్తు దేవుడు వేసిన పునాది తప్ప, వేరొక పునాదిని ఎవడును వేయజాలడు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైన దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయన, దేవుని ఆలయము పవిత్రమైనది. మీరే ఆయన ఆలయము. అల్లెలూయా వచనము (2 రా.దిన 7:16) అల్లెలూయా!అల్లెలూయా!నేను ఈ మందిరమును ఎన్నుకొని, దీనిని పవిత్రపరచితిని, ఏలయన నా నామము కలకాము ఉండును గాక. అల్లెలూయా! సువిశేష పఠనము పునీత యోహాను గారు వ్రాసిన సువార్త 2:13-22 యూదుల పాస్క పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెల్లెను. దేవాలయములో ఎడ్లను, గొఱ్ఱెలను పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చు వారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని, గొఱ్ఱెలను, ఎడ్లను, అన్నింటిని ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చు వారి నాణెములను చిమ్మి వేసి బల్లలను పడద్రోసెను. పావురముల నమ్మెడి వారితో "వీనిని ఇట నుండి తీసికొనిపొండు. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగ చేయవలదు" అని చెప్పెను. "నీ గృహము నందు నాకు గల ఆసక్తి నన్ను దహించును" అని లేఖనము నందలి వాక్యము శిష్యులకు అపుడు తలపునకు వచ్చెను. యూదులు అపుడు ఆయనతో "నీవు ఈ కార్యములు చేయుటకు మాకెట్టి గురుతు చూపెదవు?” అని ప్రశ్నించిరి. అందుకు యేసు "ఈ ఆలయమును మీరు పడగొట్టడు. నేను దీనిని మూడు రోజులలో లేపుదును" అని వారికి సమాధానమిచ్చెను. 'ఈ ఆలయ నిర్మాణమునకు నలువది ఆరు సంవత్సరములు పట్టినది. నీవు దీనిని మూడు రోజులలో లేపగలవా?" అని యూదులు తిరిగి ప్రశ్నించిరి. కాని, వాస్తవముగ ఆయన పలికినది తన శరీరమను ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను విశ్వసించిరి.